సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున

సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున
x
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటి అయ్యారు.. ఈ భేటిలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటి అయ్యారు.. ఈ భేటిలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఇటివల కురిసిన వర్షాలకి హైదరాబాదు నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే... ఈ క్రమంలో టాలీవుడ్‌ ప్రముఖులంతా ముందుకు వచ్చి తమకి తోచినంతగా సహాయం చేసి ప్రభుత్వానికి అండగా నిలిచారు..

తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.. వీటికి సంబంధించిన చెక్కులను సీఎం కేసీఅర్ కి ఈ రోజు అందజేశారు.. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, ప్రభాస్‌ , ఎన్టీఆర్, రామ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలను అందజేశారు.. అటు సీఎం భేటిలో నాగార్జున, చిరంజీవి తెలంగాణలో థియేటర్స్ ఓపెనింగ్ గురించి కూడా చర్చించినట్టుగా ప్రచారం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories