అర్జీవీ 'దిశా' సినిమాపై చెన్నకేశవులు భార్య ఏమందంటే?

అర్జీవీ దిశా సినిమాపై చెన్నకేశవులు భార్య ఏమందంటే?
x
Highlights

RGV Disha Movie : తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా సంఘటన.. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

RGV Disha Movie : తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా సంఘటన.. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు వర్మ. అయితే ఈ సినిమాని వెంటనే నిషేధించాలని కోరుతూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే..

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా పైన దిశా నిందితుల్లో ఒకరైనా చెన్నకేశవులు భార్య రేణుక స్పందించింది. HMTV కి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు వర్మ ఈ సినిమా తీయడం కరెక్ట్ కాదని, సినిమాని తీయోద్దని ఆమె అన్నారు. అయిపోయిన దానిని మళ్ళీ ఎందుకు బయటకు తీయడం అనవసరం అని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నప్పటికీ అన్నింటీపైనా సినిమా తీస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. అయితే నిర్మాత నట్టి కుమార్ మాత్రం కేవలం దిశా ఘటన పైన మాత్రమే తీయడం లేదని దేశవ్యాప్తంగా జరిగిన అనేక సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నామని, అందులో దిశా సంఘటన ఒకటి అంటూ వెల్లడించాడు. అటు దిశా కుటుంబ సభ్యులు ఈ సినిమాని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ఇక ఈ సినిమాని నవంబర్ 26, 2020 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ..ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే.. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories