చీటింగ్ కేసులో ఇరుక్కున్న హీరోయిన్

చీటింగ్ కేసులో ఇరుక్కున్న హీరోయిన్
x
Highlights

అటు బాలీవుడ్ లొనే కాక ఇటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అమీషా పటేల్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. తన సినిమాకు...

అటు బాలీవుడ్ లొనే కాక ఇటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అమీషా పటేల్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. తన సినిమాకు ఫైనాన్స్ చేసిన వ్యక్తి కి డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాక బెదిరిస్తోంది అని కేసు నమోదు అయ్యింది. అసలు కథలోకి వెళ్తే కునాల్ గుమార్ అనే నిర్మాతతో కలిసి అమీషా పటేల్ 'దేశీ మ్యూజిక్' అనే చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమాలో ఈమె నటించింది కూడా. షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా 2018 లొనే విడుదలవ్వాలి. కాని అవ్వలేదు.

అదే సమయంలో సినిమాకు ఫైనాన్స్ ఇచ్చిన అజయ్ కుమార్ సింగ్ తన డబ్బు వెనక్కి ఇచ్చేయమని ఒత్తిడి తీసుకు వచ్చాడట. 2.5 కోట్ల రూపాయల డబ్బులు పెట్టిన అజయ్ తన డబ్బులు తిరిగి కోరడంతో అమీషా పటేల్ మరియు కునాల్ లు చెక్ ఇచ్చారట. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. అదేంటని అడిగితే బెదిరిస్తున్నారట. చేసేది లేక అజయ్ కుమార్ వీరిపై కేసు నమోదు చేశాడు. తన డబ్బు తనకు ఇవ్వక పోగా పాటు కొంత మంది ఫొటోలను చూపించి బెదిరిస్తున్నారు అని అమీషా పటేల్, అజయ్ కుమార్ పై కేసు పెట్టాడు. మరి చీటింగ్ మరియు చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న ఈ హీరోయిన్ ఎలా బయట పడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories