అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్

Bollywood Director Planning Pan India Multi-Starrer With Allu Arjun
x

అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్

Highlights

*అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారా?

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఏమాత్రం ప్రమోషన్లు లేకపోయినప్పటికీ బాలీవుడ్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. అయితే తాజాగా ఇప్పుడు మంచి డైరెక్టర్ దొరికితే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టేందుకు అల్లు అర్జున్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒక డైరెక్టర్ ని అనుకున్నారు కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

గోల్మాల్, చెన్నై ఎక్స్ప్రెస్, సింబా, సూర్య వంశీ, వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ లను అందించిన డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా ఇప్పుడు "సర్కస్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే రోహిత్ శెట్టి అల్లు అర్జున్ ని ఒక స్పెషల్ మీటింగ్ కోసం ఇన్వైట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ లో వారిద్దరి కొలాబరేషన్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శెట్టి డిసెంబర్ 23న విడుదల కాబోతున్న "సర్కస్" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ రష్యాలో "పుష్ప" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి ఒక ప్రాజెక్టు గురించి డిస్కస్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే రోహిత్ శెట్టి ఒక మల్టీ స్టార్లర్ ప్లాన్ చేస్తున్నారని అందులో బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్, అల్లు అర్జున్ తో పాటు తమిళ్ స్టార్ హీరో కార్తీ కూడా హీరోలుగా అక్షయ్ కుమార్ కామియో పాత్రలో ఒక ప్యాన్ ఇండియా పోలీస్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ కూడా అల్లు అర్జున్ తో ఒక సినిమాని నిర్మించేందుకు ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. మరి వీరి కాంబోలో అల్లు అర్జున్ డెబ్యూ ఉంటుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories