గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ కు కంగనా చురకులు!

గ్రేటర్ ఎన్నికలు :  కాంగ్రెస్ కు కంగనా చురకులు!
x
Highlights

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ ఇప్పటి వరకు 32 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ ఇప్పటి వరకు 32 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించింది కంగనా.. 'ప్రియమైన కాంగ్రెస్‌.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ పార్టీ మాత్రం తన పాలనతో క్లీష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది'అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా గ్రేటర్ ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌-42 స్తానాలు గెలుచుకోగా బీజేపీ 32 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది.


Show Full Article
Print Article
Next Story
More Stories