Bigg Boss 5: కెప్టెన్ అయితే కొత్తగా కాకున్న చెత్తగా మాత్రం చేయను అంటున్న శన్ను

Bigg Boss 5: కెప్టెన్ అయితే కొత్తగా కాకున్న చెత్తగా మాత్రం చేయను అంటున్న శన్ను
x

Bigg Boss 5: కెప్టెన్ అయితే కొత్తగా కాకున్న చెత్తగా మాత్రం చేయను అంటున్న శన్ను

Highlights

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం (23/11/2021) హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మంగళవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన "నియంత మాటే శాసనం" టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న సింహసనంపై ఎవరైతే బజర్ మ్రోగగానే కూర్చుంటారో వారు ఆ రౌండ్ కి సేఫ్ అవడంతో పాటు నియంతగా వ్యవహరిస్తారు. ఇక మిగిలిన ఇంటి సభ్యులు వారిని వారు సేవ్ చేసుకోడానికి ఒక ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక ఈ ఛాలెంజ్ లో చివరి వరకు ఉన్న ఇద్దరు ఇంటి సభ్యులలో ఒకరిని సేవ్ చేసే అధికారం సింహాసనంపై కూర్చున్న నియంతకి ఉంటుందని బిగ్ బాస్ నియమాన్ని ఉంచుతాడు.

మొదటి రౌండ్‌లో బజర్ మోగగానే సిరి హనుమంత్ నియంత సింహాసనంలో కూర్చుంటుంది. అప్పుడు సిరికి తప్ప మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఛాలెంజ్ లో విజే సన్నీ, రవిలు చివరి రెండు స్థానాల్లో ఉండటంతో నియంతకి తమ వాదనలు వినిపిస్తారు. ఆ తరువాత సిరి.. రవిని సేవ్ చేస్తూ సన్నీకి ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి సేవ్ చేయలేనని చెప్తుంది. ఆ నిర్ణయంతో బాధపడిన సన్నీ ఎప్పుడూ నన్నే టార్గెట్ చేస్తున్నారని మానస్ తో పాటు శన్ముఖ్ జస్వంత్ కి చెప్పాడు.

రెండో రౌండ్‌లో శ్రీరామ్ నియంత సింహాసనాన్ని దక్కించుకోగా మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్ లో మానస్‌ అందరి కంటే ఎత్తులో చెప్పులు అతికించాడు. ఇక చివరి రెండు స్థానాల్లో ఆర్జే కాజల్‌, రవి ఉండటంతో ఆ రౌండ్ కి నియంతగా ఉన్న శ్రీరామచంద్ర ఆర్ జె కాజల్‌ని కాకుండా రవిని సేవ్ చేశాడు. ఇప్పటివరకు తాను కెప్టెన్ అవలేదని ఇదే నాకు చివరి అవకాశమని ఎంత చెప్పిన కాజల్ ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి చివరికి సేవ్ చేయలేదు. కెప్టెన్‌ అయ్యే చివరి అవకాశం లేకుండా పోయిందని బాత్‌ రూంలోకి వెళ్లి కాజల్ ఏడవడంతో ప్రియాంక వెళ్లి ఆమెను ఓదార్చింది.

మూడో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని రవి దక్కించుకున్నాడు. ఈ ఛాలెంజ్ లో మానస్‌, శన్ముఖ్ చివరి స్థానాల్లో నిలువగా వారిద్దరిలో రవి..శన్ముఖ్ జస్వంత్ ని సేవ్ చేశాడు.

నాలుగో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని చేజిక్కించుకున్న ప్రియాంక సింగ్..ఆ ఛాలెంజ్‌లో శన్ముఖ్, శ్రీరామచంద్రలు చివరి రెండు స్థానాల్లో నిలవడంతో ప్రియాంక సింగ్ శ్రీరామచంద్రని డిస్‌ క్వాలిఫై చేసి శన్ముఖ్ జస్వంత్ ని సేవ్ చేస్తుంది.

ఇక ఐదో రౌండ్‌లో భాగంగా నియంత సింహాసనంపై నేనంటే నేనే కూర్చున్నామని సిరి హనుమంత్, ప్రియాంక సింగ్ అనడంతో సంచాలక్ గా ఉన్న మానస్ ప్రియాంక సింగ్ మొదట కూర్చుందని చెప్పడంతో సిరి హనుమంత్ ఏడుస్తూ ఫస్ట్‌ నేనే కూర్చున్న వాళ్లు అబద్దాలు చెబుతున్నారని చెప్తుంది. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏడుస్తారా? గేమ్ ఆడు.. నువ్ ఇంత వీక్ అయితే నా ఫ్రెండ్‌గా ఉండకు అని చెబుతూ సిరిని కోప్పడుతాడు. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ సీజన్ 5 కి చివరి కెప్టెన్ గా నిలుస్తాడో బుధవారం ఎపిసోడ్ లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories