Bigg Boss 4 Telugu : రాక్షసత్వం అంటే ఇదే బిగ్ బాస్!

Bigg Boss 4 Telugu :  రాక్షసత్వం అంటే ఇదే బిగ్ బాస్!
x
Highlights

Bigg Boss 4 Telugu Latest Updates : మొన్న జరిగిన నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌజ్‌లో సీన్‌ ఒక్కసారిగా మారింది. మంగళవారం ఇచ్చిన లగ్జరీ బడ్జెట్‌...

Bigg Boss 4 Telugu Latest Updates : మొన్న జరిగిన నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌజ్‌లో సీన్‌ ఒక్కసారిగా మారింది. మంగళవారం ఇచ్చిన లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో ఇంటి సభ్యులు క్రూరంగా ప్రవర్తించారు. ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఇంటిని కాపాడుకోవడం వచ్చో రాదో తెలియదు కానీ, చెడగొట్టమంటే మాత్రం క్షణాల్లో చేసి చూపిస్తారు రాక్షసులు కూడా ఇంత క్రూరత్వంగా ప్రవర్తించరేమో అనిపించారు. మంచి మనుషులను ముప్పు తిప్ప పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారు. 44వ రోజు బిగ్‌బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా రెండు టీంలుగా విడగొట్టిన బిగ్‌బాస్ హౌస్‌ను పాడు చేసేలా టాస్క్ ఇచ్చారు. మరి 44వ రోజు బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగిన హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

జై లవ కుశ సినిమాలోని పాటతో నిద్ర లేచిన ఇంటి సభ్యులు జోరుగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ కొంటె రాక్షసులు మంచి మనుషులు అనే లగ్జరీ టాస్క్ ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం బిగ్‌బాస్‌పురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సాధారణ ప్రజలు ఉండేవారు. అరియాణా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక రాక్షసుల టీమ్‌లో ఉండగా మిగతా వారు మంచి మనుషుల టీమ్‌లో ఉన్నారు. ఒక్కో రాక్షసుడిని మంచి మనిషిగా మార్చిన ప్రతీసారి గార్డెన్ ఏరియాలో ఉన్న రావణుడి బొమ్మలోని పది తలల్లో రెండింటిని పగలగొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్షసులనైనా మార్చితేనే మనుషుల టీమ్ గెలిచినట్టు లెక్క అని బాగ్‌బాస్ తెలిపారు. కానీ, మంచి మనుషుల పనులకు కొంటె రాక్షసులు ఆటంకం కలిగిస్తూ ఉంటారు అయినా సరే వాళ్లు సహనాన్ని వీడకూడదని బిగ్ బాస్ సూచించారు.

టాస్క్ ప్రారంభం కాగానే అరియానా రాక్షసిగా మారింది. కిచెన్‌లో ఉన్న వంట సామాన్లు అన్నింటిని బయట పడేసింది అవినాష్ దుప్పట్లను విసిరేశాడు. కొంటె రాక్షసుడు ఎంత విసిగించినా మంచి మనుషులు మాత్రం శాంతంగానే సహించారు. ఎప్పిటిలాగే అఖిల్, అభిజీత్ మధ్య మళ్లీ చిన్న గొడవ జరిగింది. రాక్షసుల రూపంలో ఉన్న అ‌ఖిల్, మనిషి రూపంలో ఉన్నఅభిజీత్ కాస్టూమ్స్ ను పట్టుకుని వేధింపులకు గురి చేశాడు.

రాక్షసుడిగా ఉన్న అవినాస్ రావ‌ణుడి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. ఆ కోణంలో డైలాగులు వ‌ల్లించాడు. అరియానా అమ్మరాజశేఖర్ షర్ట్ లోపల ఐస్ ముక్కలు వేసినా మాస్టర్ ఏం అనలేదు. రాక్షసులు ఎంత క్షోభ పెట్టిన మనుషులు మాత్రం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాక్షసులు ఇబ్బందులకు గురి చేసిన అమ్మ రాజశేఖర్ మాత్రం శాంతం శాంతం అంటూ జపించాడు. అరియాణా అమ్మ రాజశేఖర్‌కు మెహబూబ్, దివికి రంగు పూసినా మనుషులు ఏం అనలేదు ఆ తర్వాత అవినాష్ అరుంధతి డైలాగ్‌ చెప్పడంతో మోనాల్ ఆయన్ను హత్తుకుంది.

కొంటె రాక్షసులను మంచి మనుషులుగా మార్చే అవకాశం మంచి మనుషులకు బిగ్ బాస్ కల్పించారు. స్విమ్మింగ్‌ పూల్‌లో బంతిపూలు వేసి 50 దండలుగా అల్లలని ఆదేశించారు. దాంతో సోహైల్ స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగి దండలు కట్టాడు. వాటిని రాక్షసులు చెడగొట్టేందుకు తీవ్రంగా శ్రమించి విఫలం అయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన మొదటి టాస్క్‌ను పూర్తి చేసేందుకు బజర్ మోగగానే సోహైల్ స్విమ్మింగ్‌పుల్ లోకి దిగి బంతిపూలను తీసుకొచ్చాడు. లాస్య దండ కడుతున్న సమయంలో హారిక పూలను ఎత్తుకెళ్లింది నోయల్ బంతిపూలు తీసుకెళ్లి బత్‌రూంలో దండకట్టే ప్రయత్నం చేశాడు.

అల్లిన దండలను మాస్టర్ తన మెడలో వేసుకున్నాడు. కానీ, వాటిని రాక్షసుల రూపంలో ఉన్న వారు చెడగొట్టే ప్రయత్నం చేశారు. స్విమ్మింగ్ పూల్‌లోనే ఉంటూ కాపాడుకున్నారు. అల్లిన దండలను రాక్షసులు పారేస్తూ మెడలో చుట్టుకుంటూ సర్వనాశనం చేశారు. రాక్షసులు ఎన్ని కష్టాలు పెట్టినా మనుషులు ఎట్టకేలకు టాస్క్‌ను పూర్తి చేసి రాక్షసుడి రెండు తలలు పగలగొట్టారు రాక్షసుడిగా ఉన్న అఖిల్‌ను మనిషిగా మార్చి తమ టీంలో కలిపేసుకున్నారు.

కొంటె రాక్షసులను మంచిగా మార్చేందుకు బిగ్‌బాస్ మంచి మనుషులకు రెండో టాస్క్ ఇచ్చారు. మంచి మనుషులకు క్లే తో 100 ప్రమిదలను తయారు చేయాలని ఆదేశించారు. కానీ, మనుషులు దీపాలు తయారు చేయడం మొదలు పెట్టగానే రాక్షసులు క్లే లను దొంగలించారు ఆ తర్వాత టాస్క్‌ మరింత రసవత్తరంగా మారింది. రాక్షసులను మనుషులుగా మార్చేందుకు రెండో టాస్క్ ఇచ్చారు. క్లే తో 100 ప్రమీదాలు తయారు చేయాలని ఆదేశించారు. దాంతో బజర్ మోగగానే మనుషుల దగ్గర ఉన్నా క్లే లు ఎత్తుకెళ్లారు.

నోయల్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని మరీ దీపాలు చేస్తుండటంతో మెహబూబ్, అవినాష్ ఆ రూమ్‌లోకి చొరబడి మరీ వాటిని దొంగలించారు. మరోవైపు సోహైల్ హారికను ఆపేందుకు పట్టుకోగా ఆమె అతడిని పంటితో గాటు పెట్టడంతో కేకలు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు కష్టపడి మాస్టర్ దగ్గర దీపాలు దాచిపెట్టగా మిగతావారు అతడి దగ్గరి నుంచి లేపేశారు. అయినా సరే మనుషులు 160 దీపాలు తయారు చేసి విజయం సాధించడంతో మంచి మనుషుల టీమ్ ఆనందం పట్టలేక ఇది ఫన్ అంటూ గెంతులేశారు.

అయితే మంచి మనుషుల జాబితాలో కలిపేస్తారన్న భయంతో రాక్షసులు అరియానా, మెహబూబ్, అవినాష్ ఒక్క బాత్రూమ్‌లోనే దూరిపోయారు. ఇక అప్పటికే మెహబూబ్ పేరు చెప్పినప్పటికీ అతడి జాడ దొరక్కపోవడంతో చేతికి చిక్కి హారికను మంచి మనిషిగా మార్చారు. నిజానికి హారికకు మనిషిగా మారడం ఇష్టమే అయినప్పటికీ మొదట తన పేరు చెప్పలేదని ఫీలయింది. అలాంటప్పుడు తాను మనిషిగా మారినా వారికి ఎలాంటి సాయం చేయను అంటూ ఏడుస్తూ కెమెరాలతో చెప్పుకొచ్చింది.

రాక్షసుల టీంకు మనుషులకు జరిగిన మూడో టాస్క్‌ మరింత ఇంట్రెస్ట్‌గా జరిగినట్టు ప్రొమోలో చూపించారు. స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఉన్న నీటితో డ్రమ్స్ నింపి టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాక్షసుల టీం మనుషులను అడ్డుకుంది. ఆ క్రమంలోనే మెహబూబ్, అఖిల్ మధ్య గొడవ జరిగినట్టు చూపించారు. మరి చూడాలి ఈ రోజు ఏం జరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories