Bigg Boss 4 Telugu: పట్టుకో..దాచుకో..దోచుకో.. కొత్త గొడవ మొదలైంది బిగ్ బాస్!

Bigg Boss 4 Telugu: పట్టుకో..దాచుకో..దోచుకో.. కొత్త గొడవ మొదలైంది బిగ్ బాస్!
x

BIgg Boss 4 highlights (courtesy star maa)

Highlights

Bigg Boss 4 : మొన్నటి టాస్క్ గోల ఇంకా తగ్గలేదు.. మరో ఫిజికల్ టాస్క్ తో మళ్ళీ అగ్గి పెట్టాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇప్పుడిప్పుడే గొడవల గాడిలో పడుతోంది. గ్రూపులుగా ఆడుతున్న హౌస్ మేట్స్ ను విడదీసి ఎవరికీ వారుగా ఆడాలని బిగ్ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి ఒచ్చేలా కనిపిస్తున్నాయి. మొన్నటి వారం టాస్క్ లో జరిగిన గొడవలు మర్చిపోకుండా ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నారు.. ఈలోగా ఈ రోజు మళ్ళీ కెప్టెన్ టాస్క్ అని మరో ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఇక్కడా గ్రూపులుగా ఆడటానికి ప్రయత్నించిన హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఎవరికీ వారు ఆడాలంటూ సూచించాడు. ఇక పులిహోర కథలు మామూలుగానే నడుస్తున్నాయి. అభిజిత్ ను మోనాల్ వదిలేసి పూర్తిగా అఖిల్ ను అంటిపెట్టుకుని ఉంటోంది. మరో వైపు కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్ కూడా అఖిల్ కు దగ్గరగా మసలుతోంది. అభిజిత్ కూడా దేత్తడిని పట్టించుకోవడం మానేశాడు. స్వాతి చుట్టూ తిరగడం మొదలెట్టాడు. అవినాష్ తో పులిహోర కలపడానికి అరియానా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.. కాస్త వివరంగా చేపుకుంటే..

మొన్నటి వారం టాస్క్ కు సంబంధించి ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నారు. అభిజిత్..సోహైల్ మధ్య చాలా సేపు మాటల యుద్ధం జరిగింది. తరువాత అభిజిత్, మెహబూబ్ అదే విషయంలో గొడవ పడ్డారు.

పట్టుకో..దోచుకో..దాచుకో..

ఈవారం కెప్తెన్సీ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో పడుతున్న కాయిన్స్ కలెక్ట్ చేసి ఎవరికీ వారు జాగ్రత్త చేసుకోవాలి. ఎవరు ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసి దాచుకోగాలిగితే వాళ్ళే విన్నర్. ఇదీ టాస్క్. ఇక వ్యక్తిగతంగా ఆడాల్సిన టాస్క్ ను హౌస్ మేట్స్ గ్రూపులుగా ఆడటం మొదలు పెట్టేశారు. మోనాల్‌, అఖిల్ ఒక జంటగా.. స్వాతి, అభిజిత్ ఒక జంటగా.. రాజశేఖర్..అరియానా ఒక గ్రూపుగా ఇలా గ్రూపులు కట్టేసి ఆడటం మొదలెట్టారు. మధ్యలో దివి కుమార్ సాయి కాయిన్స్ అన్నీ ఎత్తుకుపోయింది. నా కాయిన్స్ నాకు ఇచ్చేయి అంటూ దివి వెంట తిరిగాడు కుమార్ సాయి. సోహైల్ అంద‌‌రివీ కొట్టేస్తున్నాడని ఎవ‌రో అన‌డంతో గేమ్ గేమ్‌లా ఆడండ‌ని అంద‌రి మీదా విరుచుకుప‌డ్డాడు. త‌న‌ను దొంగ అంటూ ఏదో చెప్పబోయిన దివిని కూడా నువ్వేం త‌క్కువ కాదు, కుమార్ ద‌గ్గ‌ర బాగానే కొట్టేశావ్ అని చుర‌క‌లంటించాడు. త‌ర్వాత సుజాత కూడా సోహైల్‌ఫై ఫైర్ అవ‌డంతో అంద‌రూ దొంగ‌లే, నేను ఆడ‌ను, మీరే ఆడుకోండి అని ఆవేశంతో ఊగిపోయాడు. కానీ ఆ వెంట‌నే సుజాత‌కు సారీ చెప్పాడు. దివికి మాత్రం చెప్ప‌న‌న్నాడు. ఇక మధ్యలో బిగ్ బాస్ టాస్క్ వ్యక్తిగతంగా ఆడాలని వార్నింగ్ ఇచ్చాడు. టాస్క్ ఇంకా కొనసాగుతోంది బుధవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

ఈ ఎపిసోడ్ లో హైలైట్ దివి.. ఆటను సరిగ్గా అర్ధం చేసుకుంది ఆమె ఒక్కతే. చివరికి ఎవరి వద్ద కాయిన్స్ ఎక్కువ వుంటే వారే విజేత. అందరూ వారి కాయిన్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇదీ బిగ్ బాస్ టాస్క్. కాయిన్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి అనడంలోనే ఎవరైనా దోచుకోవచ్చు అనే అర్ధం కూడా ఉంది. దానిని పట్టుకుంది దివి. పడుతున్న కాయిన్స్ పట్టుకుంటూనె.. ఇతరుల కాయిన్స్ కూడా దొంగిలించే పని పెట్టుకుంది. అంతేకాదు తన వద్ద ఉన్న కాయిన్స్ జాగ్రత్త చేసుకోవడమూ మొదలు పెట్టింది. కుమార్ సాయి మళ్ళీ అదే తీరు నా కాయిన్స్ అంటూ బ్రతిమిలడుతూ తిరిగాడు. లేడీస్ మీద ఎలా తిరగాబడను అంటూ నిస్సహాయంగా ఆడుతున్నాడు. ఇక గేమ్ బ్రెయిన్ తో ఆడాలి అని కొన్ని రోజులుగా చించేసుకుంటున్న అభిజిత్ కూడా ఈ గేమ్ అర్ధం కాక.. దొంగతనాలు చేస్తున్నారు అంటూ అందర్నీ ఈసడిస్తూ మాట్లాడటం కనిపించింది.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి

ఇది అధికారిక ఓటింగ్ కాదు.. గమనించగలరు మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Show Full Article
Print Article
Next Story
More Stories