'సీత' పరిస్థితి ఏంటి?

సీత పరిస్థితి ఏంటి?
x
Highlights

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకడు. బెల్లంకొండ ఆఖరిగా 'కవచం' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా...

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకడు. బెల్లంకొండ ఆఖరిగా 'కవచం' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారిన తర్వాత తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'కవచం' మీదనే పెట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పటిదాకా టీజర్ తప్ప ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ముందుకు కదలలేదు. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ లో ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్ ఉందని తెలుస్తుంది.

కానీ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 25న విడుదల చేయాలని తేజ ఫిక్స్ అయ్యాడట. కానీ ఇంకా ట్రైలర్ విడుదల చేయాలి, సెన్సార్ పనులు, రికార్డింగ్ పనులు అని బోలెడు పనులు ఉన్నాయి. మరి ఇవన్నీ అయ్యే పనులేనా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పనులలో బిజీగా ఉండటం వల్లనే ఈ చిత్రబృందం ప్రమోషన్ల పైన దృష్టి పెట్టలేదని అందుకే ఇంకా సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టలేదు అని చెబుతోంది. కానీ అసలే మార్కెట్ తక్కువగా ఉన్న బెల్లంకొండ సినిమాను బజ్ లేకుండా విడుదల చేయటం ఒక రకంగా రిస్క్ అని చెప్పుకోవచ్చు. అందుకని త్వరలో ట్రైలర్ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సినిమా గురించి తెలియాలంటే ఒక రెండు మూడు రోజులు ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories