Bellamkonda Suresh: ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. అలాంటి వాళ్లకోసం మాట్లాడొద్దు-బెల్లంకొండ సురేష్‌

Bellamkonda Suresh: ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. అలాంటి వాళ్లకోసం మాట్లాడొద్దు-బెల్లంకొండ సురేష్‌
x
Highlights

క్రాక్ సినిమా విషయంలో డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను బడా నిర్మాత దిల్ రాజుపై చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఖండిచారు.

గత కొంత కాలంగా కరోనాతో మూసుకున్న థియేటర్లు తెరచుకున్నాయి. ఆ తర్వాత నుంచి సినిమా రిలీజ్, థియేటర్ల విషయంలో వివాదాలు టాలీవుడ్ ను చుట్టుముట్టాయి. కాగా.. క్రాక్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయినా కూడా తనకు థియేటర్లు ఇవ్వకుండా 'మాస్టర్' సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను అసహనం వ్యక్తం చేశాడు.క్రాక్ సినిమా విషయంలో డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను బడా నిర్మాత దిల్ రాజుపై చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌

తీవ్రంగా ఖండించారు. దిల్‌రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీను లేదన్నారు.

అల్లుడు అదుర్స్‌ సక్సెస్‌ మీట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. 'ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది.

సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. మీరు అన్నీ తెలుసుకుని ఇలాంటి జీఎస్టీ కట్టని వాళ్లకోసం మాట్లాడొద్దు. మీరు వెనకేసుకుని వస్తున్న ఆ వ్యక్తితో ముందు జీఎస్టీ కట్టించి.. అప్పుడు మాట్లాడండి. నేను ప్రెస్ మీట్ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. దిల్ రాజు, శిరీష్ లేకపోతే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది కాదు. దిల్ రాజు జనాలు ఆదరించే సినిమాలు చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కిల్ రాజు అంటావా?

నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా? శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. వాళ్లతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories