దర్శకుడితో గొడవపడిన బెల్లంకొండ హీరో

దర్శకుడితో గొడవపడిన బెల్లంకొండ హీరో
x
Highlights

టాలీవుడ్ దర్శకులు అందరిలోనూ ముక్కుసూటిగా, మొండితనం గా ఉండే దర్శకులలో మొదటి పేరు తేజ దే ఉంటుంది. ఆ ముక్కుసూటి తాను జీవితంలోనూ కెరీర్లోనూ చాలా ఇబ్బందులు...

టాలీవుడ్ దర్శకులు అందరిలోనూ ముక్కుసూటిగా, మొండితనం గా ఉండే దర్శకులలో మొదటి పేరు తేజ దే ఉంటుంది. ఆ ముక్కుసూటి తాను జీవితంలోనూ కెరీర్లోనూ చాలా ఇబ్బందులు పడ్డానని చాలాసార్లు మీడియాతో చెప్పాడు తేజ. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఈ మధ్యనే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తేజ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తేజ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సీత' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కొన్ని మనస్పర్ధలు తలెత్తడంతో తేజ అక్కడి నుండి వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి కారణం తేజ శ్రీనివాస్ ను పాత పాత్ర కోసం గడ్డం పెంచమని చెప్పాడట. కానీ బెల్లంకొండ హీరో ఆ పని చేయలేక పోయాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. అయితే తాను సినిమా ఆపుచేయడం లేదని కచ్చితంగా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గడ్డం పెంచుతాడా అంటే అది సీజీ వర్క్ తోనే మేనేజ్ చేయనున్నట్లు కొందరు అంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25 తారీకు న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories