Puri Jagannadh: 9 గంటలుగా ఈడీ విచారణ... బండ్ల గణేశ్‌కు పిలుపు

Bandla Ganesh Came to ED Office for Puri Jagannadh
x

Puri Jagannadh: 9 గంటలుగా ఈడీ విచారణ... బండ్ల గణేశ్‌కు పిలుపు

Highlights

Puri Jagannadh: డైరక్టర్ పూరీ జగన్నాథ్ ని ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది.

Puri Jagannadh: డైరక్టర్ పూరీ జగన్నాథ్ ని ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది, 9 గంటలుగా విచారిస్తున్న అధికారులు పూరీకి సంబంధించిన బ్యాంక్ ఎక్కౌంట్ల లావాదేవీల వివరాలు, స్టేట్ మెంట్లను పరిశీలిస్తున్నారు. పూరీ జగన్నాథ్ బండ్ల గణేష్ కు మద్య ఆర్ధిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా బండ్ల గణేష్ ను విచారణకు పిలిచినట్లు సమాచారం.

మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల దర్యాప్తు పై ఈడీ లోతుగా విచారిస్తోంది. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ, సోదరుడు సాయిరాం శంకర్, ఆడిటర్ సతీష్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. నాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు. పూరీ జగన్నాథ్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకెందుకు నోటీసులు ఇస్తారు అంటూ అక్కడి మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడారు. ఇక తాజాగా ఆయన ట్వీట్ కూడా వేశారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories