Balakrishna: మైత్రి మూవీ మేకర్స్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna Gives Strong Warning to Mythri Movie Makers
x

Balakrishna: మైత్రి మూవీ మేకర్స్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

Highlights

Balakrishna: మైత్రి మూవీ మేకర్స్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న #ఎన్బీకే107 కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న "వాల్తేరు వీరయ్య" సినిమా. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయి.

రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా అ విడుదల కి సిద్ధమయ్యాయి. అయితే రెండు సినిమాలు ఒకేసారి విడుదలయితే ప్రాఫిట్ లలో షేర్ తగ్గిపోతుందని మైత్రి మూవీ మేకర్స్ వారు బాలకృష్ణ సినిమాని డిసెంబర్ లోనే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు.ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీని మార్చుకోమని బాలకృష్ణను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు మైత్రి మూవీ మేకర్స్ వారు. కానీ బాలకృష్ణ మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోలేదట.నిజానికి "ఆచార్య" సినిమా డిజాస్టర్ అయింది.

ఈ మధ్యనే చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా కూడా మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్టర్ల పరంగా అంతంతమాత్రంగానే అనిపిస్తోంది. మరోవైపు బాలకృష్ణ మాత్రం "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ తన సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సందర్భంగా నే విడుదల అవ్వాలని మైత్రి వారికి వార్నింగ్ ఇచ్చారట. మరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ రెండు సినిమా విడుదల విషయంలో ఏం చేయబోతున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories