ధనుష్, విజయ్ సేతుపతి సినిమాలను ఆపేసిన బాహుబలి నిర్మాతలు

ధనుష్, విజయ్ సేతుపతి సినిమాలను ఆపేసిన బాహుబలి నిర్మాతలు
x
Highlights

కోలీవుడ్ స్టార్ హీరోల లో ధనుష్ మరియు విజయ్ సేతుపతి పేర్లు ముందే ఉంటాయి. అయితే తాజాగా వీరిద్దరి రాబోయే సినిమాలకు బాహుబలి నిర్మాతలు అడ్డుకట్ట వేశారు....

కోలీవుడ్ స్టార్ హీరోల లో ధనుష్ మరియు విజయ్ సేతుపతి పేర్లు ముందే ఉంటాయి. అయితే తాజాగా వీరిద్దరి రాబోయే సినిమాలకు బాహుబలి నిర్మాతలు అడ్డుకట్ట వేశారు. వివరాల్లోకి వెళితే ధనుష్ హీరోగా 'ఎన్నై నోకి పాయిమ్' చిత్రాన్ని పి మధన్ నిర్మించారు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా కె ప్రొడక్షన్స్ అధినేత ఎఎన్ రాజరాజన్ 'సింధుబాద్' అనే చిత్రాన్ని నిర్మించారు. వీరిద్దరు కూడా బాహుబలి చిత్ర నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనిలకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంది.

కానీ తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వడం లేదంటూ బాహుబలి నిర్మాతలు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్కా మీడియా వారి కేసును పరిశీలించిన హైకోర్టు ఈ రెండు సినిమాల పై స్టే ఆర్డర్ ను విధించింది. అంటే ఆర్కా మీడియా తో ఇద్దరు నిర్మాతలకు ఉన్న గొడవ తీరే వరకు ఈ సినిమాలు విడుదల అయ్యే ప్రసక్తే లేదు. ఒకవైపు బాహుబలి నిర్మాతలు ఈ సినిమా నిర్మాతల పై నిప్పులు చెరుగుతూ ఉంటే మరోవైపు ధనుష్ మరియు విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం బాహుబలి నిర్మాతల పై మండిపడుతున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories