Covid19: కోలీవుడ్ పై ప‌గ‌బ‌ట్టిన క‌రోనా.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

Covid19: కోలీవుడ్ పై ప‌గ‌బ‌ట్టిన క‌రోనా.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌
x
Highlights

Covid19: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాల‌పై ప‌డింది.

Covid19: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాల‌పై ప‌డింది. భార‌త దేశ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఈ కొవిడ్ విల‌యానికి అత‌లాకుత‌లం అవుతున్నాయి. కరోనా తీవ్రతతో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. దీంతో ఇండస్ట్రీ పై ఆధారపడ్డ అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమకు కష్టాలతో పాటు ప‌లువురు న‌టీన‌టులు క‌రోనా బారినప‌డి మ‌ర‌ణించ‌డంతో తీవ్ర విషాదం నెల‌కొంది.

తమిళ టాప్ కమెడియన్ వివేక్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కరోనా కాటుకు బలయ్యారు. తాజాగా మరో తమిళ నటుడు నితీష్ వీరా(45) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ధనుష్ హీరోగా నటించగా గత ఏడాది విడుదలైన అసురన్ ఈ సినిమాతో నితీష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఆయన పేరరసు వెన్నిల కబడి కుళు పుదు పెట్టయ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. విజయ్ సేతుపతి శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లాభం సినిమాలో నితిశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నీరో అనే మరో సినిమాలో చేశాడు. నితీశ్ ఆకాస్మిక మ‌ర‌ణంతో కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ దిగ్భ్రాంతికి గురిచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories