డివోషనల్ సినిమా సైన్ చేసిన దేవసేన

డివోషనల్ సినిమా సైన్ చేసిన దేవసేన
x
Highlights

'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి గత ఏడాది మొదట్లో 'భాగమతి' అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంతో బ్లాక్...

'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి గత ఏడాది మొదట్లో 'భాగమతి' అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనుష్క ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ మధ్యనే బరువు తగ్గి సరికొత్త లుక్తో మళ్ళీ 'సైలెన్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ మాధవన్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు ఫారెన్ లో జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలులేదు కానీ అప్పుడే అనుష్క తన తర్వాతి సినిమా ను లైన్లో పెట్టేసింది.

తాజా సమాచారం ప్రకారం అనుష్క సంతోష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ సినిమా అయ్యప్ప స్వామి పై బేస్ అయి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమాను తెలుగు మాత్రమే కాక తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారట. డివోషనల్ సినిమా అంటే సంగీతానికి పెద్దపీట ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ సినిమా కోసం ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories