KBCలో రూ.కోటి గెలిచిన మరో మహిళ!

KBCలో రూ.కోటి గెలిచిన మరో మహిళ!
x
Highlights

అయితే గత మూడు వారల నుంచి అయితే ఈ సీజన్ లో పాల్గొన్న మహిళలు వరుసగా గత రెండు మూడు వారలుగా కోటి రూపాయలను గెలుచుకుంటూ వస్తున్నారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌ మంచి సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. అయితే గత మూడు వారల నుంచి అయితే ఈ సీజన్ లో పాల్గొన్న మహిళలు వరుసగా గత రెండు మూడు వారలుగా కోటి రూపాయలను గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నజియా నసీమ్‌, మోహితా శర్మ షోలో విజేతలుగా నిలిచి కోటి రూపాయలు గెలుపొందగా, తాజాగా మరో మహిళ కోటి రూపాయలను గెలుచుకొని అబ్బురపరిచింది ఆమె అనుపమ దాస్‌.

దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా, కోటి రూపాయలను గెల్చుకోగానే అనుపమ దాస్ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్‌ ఈ నెల 25వ తేదిన సోని టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. తన తల్లి గాల్‌ బ్లాడర్‌ క్యాన్సర్‌తో బాధపడుతుందని, ఆమె తన గెలుపు క్షణం అంతా కూడా తన చికిత్స కొరకు గడపాలని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాట విన్న అమితాబ్ బచ్చన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక అనుపమ దాస్ ఏడూ కోట్ల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రూ.కోటి తీసుకొని గేమ్‌ నుంచి నిష్క్రమించారు. దీనికి ముందు నజియా నసీమ్, ఐపిఎస్ మోహితా శర్మ కోటి రూపాయలు గెలిచారు.



Show Full Article
Print Article
Next Story
More Stories