Mahesh Babu: 'సరిలేరు నీకేవరు' సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్

Anil Ravipudi plans a sequel for Sarileru Neekevvaru
x

అనిల్ రావిపూడి (ఫొటో ట్విట్టర్)

Highlights

Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం దర్శకత్వంలో రాబోయే చిత్రం 'సర్కారు వారి పాట' తో బిజీగా ఉన్నాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం దర్శకత్వంలో రాబోయే చిత్రం 'సర్కారు వారి పాట' తో బిజీగా ఉన్నాడు. అలాగే మహేశ్ బాబు మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మహేష్ త్వరలో తన తదుపరి చిత్రానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌలితో చేతులు కలపబోతున్నారు. అయితే, మహేష్ బాబు, రాజమౌళి సినిమాకి ముందే 2 నుంచి 3 ప్రాజెక్టులను చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పనిచేయడానికి ఓకే ఇచ్చాడు. 'సర్కారు వారి పాట' సినిమా అయిపోగానే వెంటనే త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు కాంబోలో వచ్చిన 'సరిలేరు నీకెవరు' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కూడా రాస్తున్నాడు. అనిల్ ప్రస్తుతం తన 'ఎఫ్ 3' సినిమా సీక్వెల్ పనిలో బిజీగా ఉన్నారని తెలుసు. తన 'రాజా ది గ్రేట్' సినిమాకు కూడా సీక్వెల్ రావాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు, అనిల్ రావిపుడి 'సరిలేరు నీకెవరు' సినిమాకు సీక్వెల్ రావాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు మహేష్ బాబు ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories