శ్రీనువైట్ల నీ అంతు చూస్తా అన్నారు :అనిల్ రావిపూడి

శ్రీనువైట్ల నీ అంతు చూస్తా అన్నారు :అనిల్ రావిపూడి
x
srinu vaitla, anil ravipudi ( File photo )
Highlights

దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఆగడు’.. ఈ సినిమా

దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'ఆగడు'.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

పటాస్ సినిమాకి ముందు పలు చిత్రాలకి రచయతగా పనిచేశాడు అనిల్ రావిపూడి.. ఈ క్రమంలోనే ఆగడు సినిమాకి కూడా రచయతగా పనిచేశాడు అనిల్.. అయితే ఆ సినిమా జరుగుతుండగానే అనిల్ కి హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా ఒకే అయిందట. దీనితో సెకండ్ హాఫ్ అప్పటికి ఇంకా పూర్తి కాలేదట. దాంతో 'పటాస్' సినిమాకు అనుకున్న సెకండ్ హాఫ్‌ను 'ఆగడు'కి వాడుకుందామని దర్శకుడు శ్రీనువైట్లతో చెబుదామని వెళ్ళాడట అనిల్. కానీ అప్పటికే శ్రీను వైట్ల సెకండ్ హాఫ్‌ మీద వర్క్ స్టార్ట్ చేయడంతో అయన అనుకున్న రూట్ లోనే వెళ్లారట అనిల్. ఒకవేళ నేను ఆయనతో దీని గురించి డిస్కస్ చేసి ఉంటే 'పటాస్' సెకండ్ హాఫ్‌ 'ఆగడు' అయ్యుండేదేమోనని . ఆ సమయంలో మాకు టైం లేకా ఫాస్ట్‌గా స్క్రిప్ట్ చేశామని అనిల్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే ఏమయ్యా నాతో సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్లిపోయావ్ నీ అంతు చూస్తా అని అంటుంటారని చెప్పుకొచ్చాడు అనిల్.. ఎప్పటికీ ఈ విషయంలో నాకు బాధగానే ఉంటుందని, నేను ఆ సినిమా కోసం సమయం కేటాయించి ఉంటే 'ఆగడు' మంచి హిట్ అయివుండేదని చెప్పుకొచ్చాడు అనిల్ ..

ప్రస్తుతం అనిల్ రావిపూడి మహేష్ బాబుతో కలిసి 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజుల తో కలిసి మహేష్ సినిమాని నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories