స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన షీలా కౌర్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ భామకి పెళ్లి అయిపొయింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని షీలా చెన్నైలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. శిలా కౌర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో హీరోయిన్ గా నటించింది. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 కి పైగా సినిమాల్లో నటించింది.
ఇక తెలుగులో నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోకచిలుక సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. ఆ తరవాత రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, సినిమాలలో నటించింది. ఇక అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ అదుర్స్ , రామ్ మస్కా సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. షీలా చివరగా బాలకృష్ణ హీరోగా వచ్చిన పరమవీరచక్ర సినిమాలో కీలకపాత్ర పోషించింది.
Our Dearest Actress #Sheela & #EvpSanthoshReddy
— Vega Entertainment (@vegaent) March 13, 2020
"Best wishes on this wonderful journey, as you build your new lives together." 💑❤️❤️#Tollywood #Vega #Entertainment #VegaEntertainment pic.twitter.com/XG79Zl94bs
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire