భారమంతా దిల్ రాజు మరియు రష్మిక మందన్న లపై పడిందా

All the Burden falls on Dil Raju and Rashmika Mandanna
x

భారమంతా దిల్ రాజు మరియు రష్మిక మందన్న లపై పడిందా

Highlights

*విజయ్ బదులు "వారసుడు" కోసం రంగంలోకి దిగబోతున్న ముగ్గురు..

Tollywood: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈమధ్య వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు తను నిర్మించిన "వారసుడు" సినిమాని తెలుగులో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కాగా "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మరోవైపు రష్మిక మందన్న కూడా గత కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి విజయ్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. తమిళ్ లో కూడా తన సినిమా ప్రమోషన్స్ లో విజయ్ ఎప్పుడు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలోనే డబ్బింగ్ వెర్షన్ కి కూడా ప్రమోట్ చేయడానికి విజయ్ ఆసక్తి చూపించడం లేదట. కానీ దిల్ రాజు మాత్రం విజయ్ ను కనీసం ఒక్క ప్రెస్ మీట్ కైనా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విజయ్ మాత్రం దానికి కూడా నో అన్నారట. దీంతో దిల్ రాజు, రష్మిక మందన్న మరియు వంశీ పైడిపల్లి మాత్రమే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సంక్రాంతి సందర్భంగా "వాల్తేరు వీరయ్య", "వీర సింహారెడ్డి" వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. చిరంజీవి మరియు బాలకృష్ణ ఈ సినిమాని వేరే లెవెల్ లోనే ప్రమోషన్లు చేస్తున్నారు. మరి చిరంజీవి బాలయ్యలతో పోలిస్తే విజయ్ కి టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ చాలా తక్కువ నే చెప్పాలి. మరి ఈ సమయంలో విజయ్ ప్రమోషన్స్ కి కూడా రాకుండా కేవలం దిల్ రాజు, వంశీ పైడిపల్లి మరియు రష్మిక మందన్నలతో సినిమాపై క్రేజ్ ఏర్పడుతుందా లేదా అనేది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories