మళ్లీ గాయకుడిగా మారనున్న హీరో

మళ్లీ గాయకుడిగా మారనున్న హీరో
x
Highlights

కేవలం 'బొమ్మరిల్లు' సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ తెలుగు లో ఎక్కువ కాలం తన ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల...

కేవలం 'బొమ్మరిల్లు' సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ తెలుగు లో ఎక్కువ కాలం తన ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల తరువాత కొన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రెండేళ్ల క్రితం 'గృహం' అనే హారర్ సినిమాతో మనముందుకు వచ్చాడు. అయితే సిద్ధార్థ్ ఒక మంచి నటుడు మాత్రమే కాక మంచి సింగర్ కూడా. తాను నటించిన 'బొమ్మరిల్లు', 'ఓ మై ఫ్రెండ్' సినిమాలలో ఇప్పటికే తన టాలెంట్ ను బయటపెట్టిన సిద్దార్థ్ ఇప్పుడు మళ్లీ ఒక తెలుగు సినిమా కోసం గళం విప్పనున్నాడు.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న హీరో సందీప్ కిషన్ తానే నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' అని ఒక సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ఒక పాట పాడాడు సిద్ధు. సోమవారం నాడు ఈ పాట రికార్డింగ్ పూర్తయింది. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. సందీప్ తో తనకున్న స్నేహం వల్ల మాత్రమే సిద్ధార్థ్ సినిమాలో పాట పాడటానికి ఒప్పుకున్నాడని చిత్రబృందం చెబుతోంది. ఇక సిద్ధార్థ్ హీరోగా కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories