బాలీవుడ్ లో పేలిన డ్రగ్ బాంబ్.. టాలీవుడ్ లో రీసౌండ్ !

బాలీవుడ్ లో పేలిన డ్రగ్ బాంబ్.. టాలీవుడ్ లో రీసౌండ్ !
x
Highlights

బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ బాంబ్ ప్రభావం ఇప్పుడు సౌత్ వరకూ విస్తరించింది. అక్కడ సౌండ్ వస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్...

బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ బాంబ్ ప్రభావం ఇప్పుడు సౌత్ వరకూ విస్తరించింది. అక్కడ సౌండ్ వస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా తెలిపిన పేర్లు తెలుగు ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో అనే టెక్షన్ వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంది.

బాలీవుడ్ లో చెలరేగిన డ్రగ్స్ ప్రకంపనలు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని టచ్ చేసింది. సుశాంత్ సింగ్ మృతి కేసులో తీగలాగితే టాలీవుడ్ లో డొంక కదలడంతో ఒక్కొక్కరిని షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా రియా వెల్లండించిన పేర్లు బాలీవుడ్‌తో సహా సౌత్ ఇండియన్ సినీ వర్గాలను సైతం వణికిస్తున్నాయి. సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ రాకెట్‌లో ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లను బయటపెట్టింది.

డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తుండగా ఒక్కొక్కటిగా ఆమె రివీల్ చేస్తున్న పేర్లు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లను రియా బయటపెట్టింది. అయితే ఈ 25 మందిలో ఇంకెవరెవరి ప్రముఖుల పేర్లు ఉన్నాయో అని కొందరు సినీస్టార్స్ టెక్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కంగనా, ఇటు తెలుగునటి మాధవీలత ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కామన్ అని కామెంట్ చేయడంతో ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఏ రేంజ్ లో ఉందో అని అనుమానాలు బలపడుతున్నాయి. రకుల్ ప్రీత్‌‌కు రియాకు మధ్య మంచి స్నేహం ఉంది. ఇక్కడ రకుల్ తో క్లోస్ గా ఉండేవాళ్లపై కూడా డ్రగ్స్ యూజర్స్ అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం ఒక క్లియర్ పిక్చర్ కనబడుతుంది. ఒక వేళ రకుల్ ప్రీత్ ను విచారిస్తే టాలీవుడ్ సెలెబ్రెటీల్లో ఎందరి పేర్లు బయటకు వస్తాయో మనకు తెలీదు.

టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు లేవడం ఇదేమి కొత్తకాదు. 2017లో తెలుగు ఇండస్ట్రీలో ఎందరో సినీస్టార్స్ డ్రగ్స్ యూజర్స్ గా మారారని వార్తలు వచ్చాయి. సినీస్టార్స్ కొందరు డ్రగ్స్ కు బనిసయ్యారని స్వయంగా పోలీసులే స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్ డీలర్ల ద్వారా ఎవరెవరికి సంబంధాలున్నాయో ఆ లిస్ట్ అంత తమ వద్ద ఉందని చెప్పుకచ్చారు. త్వరలో ఆధారాలతో సహ పేర్లను బయటపెడతమంటూ గొప్పలు చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ చీఫ్ ఆధ్వర్యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. కానీ చివరకు ఏం తేల్చకుండానే మ్యాటర్ సైడ్ ట్రాక్ ఎక్కేసింది.

టాలీవుడ్ లో గతంలోనూ డ్రగ్స్ బాంబ్ పేలింది. అప్పట్లో పలువురు ప్రముఖులు హీరోలు, హీరోయిన్లు, దర్శకులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించి హడావుడి చేశారు. ఆ కేసులో విచారించిన సినీ ప్రముఖులనెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. తర్వాత ఆధారాలు, సాక్ష్యాలు సరిగ్గా లేవంటు ఫైల్ క్లోజ్ చేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇండస్ట్రీ పెద్దల ఒత్తిళ్ల కారణంగానే కేసును నీరుగార్చారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై సిట్ కూడా ఎలాంటి ప్రకటన ఇచ్చినట్లుగా వార్తలు వెలువడలేదు.

ఇదిలా ఉండగా బాలీవుడ్ - శాండిల్ వుడ్ లలో డ్రగ్స్ కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. శాండిల్ వుడ్ లో హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనతో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఇక బాలీవుడ్ లో సుశాంత్ సూసైడ్ కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు కొందరు డ్రగ్ డీలర్స్ ని అరెస్ట్ చేసి కీలక సమాచారం రాబడుతున్నారని తెలుస్తోంది.

అయితే గతంలో ఆరోపణలు, విచారణలు ఎదుర్కున్న వారికి ఇప్పుడు ఏమైనా సంబంధాలున్నాయా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నార్కో కంట్రోల్ బోర్డు ఇంకా కొత్త పేర్లు వెల్లడించే అవకాశం లేకపోలేదు. ఒక వేళ వెల్లడిస్తే అందులో ఇంకా ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి. ఇలాంటి చర్చ ఇటు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. గతంలో కాకుండా ఈ సారి మాత్రం కేసు దర్యాప్తు సీరియస్ గానే సాగేలా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో డ్రగ్స్ యూజర్స్ అంటూ ఆరోపణలు, విచారణలు తప్పా ముందుకు వెళ్లలేదు. ఈ కేసులో మాత్రం ఎన్ సీబీ దూకుడుగానే వ్యవహరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories