మేజర్ మిస్టరీ చెప్పేసిన అడవి శేష్

మేజర్ మిస్టరీ చెప్పేసిన అడవి శేష్
x
Highlights

శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్, స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీ బ్యానర్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మస్తున్నారు

విభిన్నమైన చిత్రాలను చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో అడవి శేషు ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మేజర్ అనే కొత్త సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన మేజర్ ఉన్ని కృష్ణన్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్, స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీ బ్యానర్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మస్తున్నారు.. ఈ సినిమాలో అడవి శేషు సరస్నాశోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది.

ఇక ఇదలా ఉంటే అసలు ఈ మేజర్ సినిమా ఎలా మొదలైంది. సినిమాకి సంబంధించిన కొన్నిఆసక్తికర విషయాలను అడవిశేషు తాజాగా వెల్లడించారు. 26/11 ముంబై ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను. ఆ సమయంలో అక్కడి వార్తా చానెళ్లో మధ్యహ్నం ఆయన ఫొటో చేశాను. వెంటనే మా అన్నయ్యలా అనిపించాడు. అప్పుడు నాకు ఆయన కళ్లలో ఒక స్పిరిట్ కనిపించింది.

అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకి సంబంధించిన ప్రతి వార్తను కత్తిరించి పెట్టుకున్నాను. కంప్యూటర్ లో అయితే దాచిపెట్టుకున్నాను. ఈ సినిమా చేయలన్నప్పుడూ వెంటనే అతడి తల్లిదండ్రులను కలిశాను. మహేష్ బాబుగారు, సోనీ పిక్చర్స్ సమకారంతో పాన్ ఇండియా సినిమా తీసయాలని అనుకున్నామని శేష్ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories