హోస్ట్ గా మారుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

హోస్ట్ గా మారుతున్న ఎన్టీఆర్ హీరోయిన్
x
Highlights

సినిమాలకి దూరం అయ్యాక పూర్తిగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా మళ్ళీ సమీరా కెమరా ముందుకు రానున్నారని తెలుస్తోంది. అయితే నటిగా మాత్రం కాదట.

చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది నటి సమీరారెడ్డి... 'అశోక్', 'జై చిరంజీవ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది సమీరా రెడ్డి.. ఆ తర్వాత తెలుగులో ఆమెకి ఆఫర్లు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మించింది సమీరారెడ్డి.

సినిమాలకి దూరం అయ్యాక పూర్తిగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా మళ్ళీ సమీరా కెమరా ముందుకు రానున్నారని తెలుస్తోంది. అయితే నటిగా మాత్రం కాదట.. హోస్ట్ గా అని తెలుస్తోంది. ఓ హిందీ ఛానెల్ లోని ఓ కార్యక్రమాన్ని త్వరలోనే సమీరా రెడ్డి హోస్ట్ గా చేయబోతున్నారని సమాచారం. ఇంతకీ సమీరా రెడ్డి హోస్ట్ గా చేస్తోంది ఎలాంటి షో అనే విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

హీరోయిన్ గా ఇప్పటివరకు మెప్పించిన సమీరా రెడ్డి ఆ మద్య లేడీ విలన్ పాత్రలు చేసేందుకు సిద్దమైందంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో ఆర్య, విశాల్ కలిసి చేయనున్న కొత్త చిత్రంలో సమీరా రెడ్డి లేడీ విలన్ గా కనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపైన స్పందించిన సమీరా అవి ఫేక్ న్యూస్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు యాంకర్ అంటూ వస్తున్న వార్తల పైన సమీరా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories