'విరాటపర్వం' లోకి అల వైకుంఠపురంలో భామ!

విరాటపర్వం లోకి అల వైకుంఠపురంలో భామ!
x
Highlights

అయితే ఇప్పుడు ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ నటించనుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. అయితే ఇందులో ఆమె పాత్ర ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

హీరో దగ్గుబాటి రానా సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం 'విరాటపర్వం'. ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా పైన మంచి అంచనాలను పెంచేసింది. అయితే లాక్‌డౌన్‌ టైంలో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తాజాగా మొదలైంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ నటించనుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. అయితే ఇందులో ఆమె పాత్ర ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఏడాది నివేదా పేతురాజ్‌ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక అటు విరాటపర్వం సినిమాలో ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories