ఖుష్బూ ఇంట విషాదం

ఖుష్బూ ఇంట విషాదం
x
Highlights

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 వేల మందికిపైగా కరోనా బాధితులుండగా వారిలో రెండువేలమందికి పైగా మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ముంబయిలో ఉన్న ప్రముఖ సినీ నటి ఖుష్బూ బంధువు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వదిన కరోనా వైరస్ తో మృతి చెందారు. దీంతో, ఖుష్బూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన వదిన చనిపోయిన విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రాణాంతక వ్యాధి కారణంగా ఆమె మరణించారని చెప్పారు. తమకు దూరంగా ఈ లోకం నుంచి ఆమె వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories