
keerthy suresh
Keerthy Suresh : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్
Keerthy Suresh : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది..
ఇక ఇటీవలే పెంగ్విన్ మూవీతో అలరించింది ఈ బ్యూటీ... ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది కీర్తి సురేష్... అయితే ఈ భామ నిర్మాతగా మారిందని తెలుస్తోంది. ప్రసుతం ఆమె ఓ తమిళ్ లో ఓ వెబ్సిరీస్ ను నిర్మించేందుకు కీర్తిసురేశ్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్... ఇందులో ఆమె కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. విభిన్నమైన కథలతో అలరిస్తున్న కీర్తి సురేష్ ఎలాంటి కథతో వెబ్సిరీస్ చేయనుంది అన్నది ఆకస్తిగా మారింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారి వారి పాటలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు.. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాకింగ్ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. అటు రజినీకాంత్ సినిమాలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోంది ఈ భామ..

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire