Keerthy Suresh : నిర్మాతగా కీర్తి సురేష్?

Keerthy Suresh : నిర్మాతగా కీర్తి సురేష్?
x

 keerthy suresh

Highlights

Keerthy Suresh : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్

Keerthy Suresh : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది..

ఇక ఇటీవ‌లే పెంగ్విన్ మూవీతో అలరించింది ఈ బ్యూటీ... ఈ సినిమా తర్వాత మ‌రికొన్ని ప్రాజెక్టుల‌ను కూడా లైన్ లో పెట్టింది కీర్తి సురేష్... అయితే ఈ భామ నిర్మాత‌గా మారిందని తెలుస్తోంది. ప్రసుతం ఆమె ఓ త‌మిళ్ లో ఓ వెబ్‌సిరీస్ ను నిర్మించేందుకు కీర్తిసురేశ్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్‌... ఇందులో ఆమె కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. విభిన్నమైన కథలతో అలరిస్తున్న కీర్తి సురేష్ ఎలాంటి కథతో వెబ్‌సిరీస్ చేయనుంది అన్నది ఆకస్తిగా మారింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారి వారి పాటలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు.. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాకింగ్ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. అటు రజినీకాంత్ సినిమాలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోంది ఈ భామ..

Show Full Article
Print Article
Next Story
More Stories