ఆ కుర్ర హీరో పై రివెంజ్ అంటున్న కీర్తి సురేష్‌

ఆ కుర్ర హీరో పై రివెంజ్ అంటున్న కీర్తి సురేష్‌
x
Highlights

రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మలయాళ నటి కీర్తి సురేష్. ఆ తరవాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మలయాళ నటి కీర్తి సురేష్. ఆ తరవాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు ఓటీటీలో విడుద‌ల కాగా, అవి ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయాయి. ప్రస్తుతం నితిన్ స‌ర‌స‌న రంగ్ దే, మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, ర‌జ‌నీకాంత్ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది కీర్తి!

తాజాగా రంగ్ దే షూటింగ్ షూటింగ్ లో పాల్గొంది కీర్తి. అయితే షూట్ బ్రేక్‌లో కీర్తి నిద్ర పోతుంటే ఆ పిక్ తీసిన మేము చెమ‌ట‌లు కారుస్తుంటే కీర్తి హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అనే కామెంట్ పెట్టాడు హీరో నితిన్ .. అయితే దీనికి స్పందించిన కీర్తి .. నేను త‌ప్ప‌కుండా రివేంజ్ తీర్చుకుంటాను. ఇక పై షూటింగ్ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నా అంటూ త‌న పోస్ట్‌లో వెల్లడించింది.

ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories