'పూలరంగడు'తో జతకట్టనున్న 'రంగమ్మత్త'

పూలరంగడుతో జతకట్టనున్న రంగమ్మత్త
x

 అనసూయ, సునీల్ ఫైల్ ఫోటో 

Highlights

యాంకర్‌గా బుల్లితెరపై హంగామా చేస్తుంది అనసూయ. 'రంగస్థలం' సినిమాతో రంగమ్మత్తగా ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

హాట్ యాంకర్‌గా బుల్లితెరపై హంగామా చేస్తుంది అనసూయ. 'రంగస్థలం' సినిమాతో రంగమ్మత్తగా ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా ఇచ్చిన కిక్ తో వెండితెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆ తర్వాత నాగార్జునలో 'సోగ్గాడే చిన్ని నాయన'తో చిత్ర పాత్రలో నటించింది. క్షణం, యాత్ర, కథనం, సినమాలతో ఇలా వరుస ఆవకాశాలను పట్టేస్తుంది. తాజాగా ఈ జబర్దస్త్ బ్యూటీకీ కమెడియన్‌గా, హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సునీల్ 'వేదాంతం రాఘ‌వ‌య్య' సినిమాలో అవకాశం వచ్చిందని సమాచారం.

ఈ సినిమాలో నటించేందుకు అనసూయకు చిత్రయూనిట్ భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. దీంతో సునీల్ సరసన 'వేదాంతం రాఘ‌వ‌య్య' మూవీలో నటించేందుకు అనసూయ సుముఖత వ్యక్తం చేసిందని ఫిలిం నగర్ బొగట్ట. కాగా ఈ మూవీలో హీరోయిన్ రోల్ చాలా కీలకంగా ఉండనుందట. ఈ నేపథ్యంలో అనసూయకు ఆ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. పాత్ర పరిధి నచ్చడంతో అనసూయ ఈ మూవీలో నటించేందుకు పచ్చజెండా ఊపేసిందని సమాచారం. అతి త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.

సి. చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకు డైనమిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కథ అందిస్తుండటం విశేషం. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట‌, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మూవీ ఇలా ఉండగానే సునీల్ సరసన నటించే క్రేజీ ఆఫర్ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories