గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీల్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీల్..
x
Highlights

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అయితే తాజాగా ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన కమెడియన్ సునీల్ .. నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు.. ఈసందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. మన జీవితానికి కావలసిన ఆక్సిజన్ తీసుకోవడం కోసం మొక్కలు నాటాలి. పెద్దవాళ్ళు కూడా వృక్షో రక్షిత రక్షితః అని చెప్పారు కాబట్టి నా బాధ్యతగా ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగిందని సునీల్ వెల్లడించాడు.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సునీల్ వెల్లడించాడు. ఈ సందర్బంగా సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ , హీరో సుహాస్ , హీరోయిన్ చాందిని చౌదరి , మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ , కమెడియన్ వైవా హర్ష లకు ఛాలెంజ్ విసిరారు సునీల్.

Show Full Article
Print Article
Next Story
More Stories