గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో నటుడు రాజా రవీంద్ర!

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో నటుడు రాజా రవీంద్ర!
x
Highlights

తాజాగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ నటుడు రాజా రవీంద్ర స్వీకరించారు. గండిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో.. మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు పెంచడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

తాజాగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ నటుడు రాజా రవీంద్ర స్వీకరించారు. గండిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో.. మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు పెంచడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా వల్ల మనం నివసించడం కోసం మొక్కలను కూడా నరికివేసి ఇళ్లను కట్టుకుంటున్నాము కానీ వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు రవీంద్ర అభినందనలు తెలిపారు. అనంతరం నటులు నిఖిల్, సునీల్, నవీన్ చంద్ర లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories