Breaking News: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌

Acharya Movie Pre Release on April 23 in Vijayawada
x

Breaking News: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌

Highlights

Breaking News: ఏప్రిల్‌ 23న విజయవాడలో ఆచార్య ప్రీ రిలీజ్

Breaking News: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌ వచ్చేసింది. ఈ నెల 23న విజయవాడలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. సిద్దార్ద కాలేజీ ప్రాంగణం ఈ వేడుకకు వేదిక కానుంది. ఆచార్య ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిధిగా సీఎం జగన్‌ హాజరయ్యే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల టికెట్ల జీవోపై సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయ్యారు. టికెట్ల రేట్లతో పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రీ రిలీజ్ వేదికపై సీఎం జగన్‌కు సన్మానం చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ వేదిక నుంచి ఇండస్ట్రీపై సీఎం జగన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories