20 సెట్స్ కోసం 60 కోట్లా

20 సెట్స్ కోసం 60 కోట్లా
x
Highlights

'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి...

'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రోమ్ మరియు ఇటలీ బాక్ డ్రాప్ కావాలట.

అయితే దానికోసం ఆర్ట్ డిజైనర్ రవీందర్ రెడ్డి రోమ్ కల్చర్ మరియు ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబించేలా సెట్స్ ను తయారు చేస్తున్నారట. సినిమా కోసం దాదాపుగా 20 సెట్స్ ను డిజైన్ చేస్తున్నారని వాటి కోసం ఏకంగా 60 కోట్ల బడ్జెట్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రబృందం మాత్రం ఈ బ్యాక్ డ్రాప్ సినిమాలో హైలైట్ గా మారుతుందని విశ్వసిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం మరొక రెండు సెట్స్ ను వేస్తున్నారని కేవలం హైదరాబాద్ లో ఈ సినిమా కోసం వేసిన సెట్స్ కోసమే 80 కోట్లు వెచ్చించారని తెలుస్తోంది. సెట్స్ విలువ చూస్తేనే ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది. గోపికృష్ణ మరియు మూవీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories