శౌర్య సినిమాకి నిర్మాతలు లేరు

శౌర్య సినిమాకి నిర్మాతలు లేరు
x
Highlights

ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాల తర్వాత నాగ శౌర్య మరియు శ్రీనివాస్ అవసరాల కలిసి ఇంకో సినిమా చేసేందుకు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పై...

ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాల తర్వాత నాగ శౌర్య మరియు శ్రీనివాస్ అవసరాల కలిసి ఇంకో సినిమా చేసేందుకు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పై అందరిలో నూ అంచనాలు పెరిగిపోయాయి. కానీ విచిత్రమేమిటంటే ఈ సినిమా కి నిర్మాతలే కరువయ్యారు. ఇప్పటికీ ఒక్క నిర్మాత కూడా హీరో, దర్శకుడు చెప్తున్నా బడ్జెట్ లో సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ సినిమా ఇప్పటికే మొదలు కావాల్సింది కానీ అనుకోని కారణాల వలన లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా నిర్మాత లేకపోవడం తో మరింత ఆలస్యం ఆయె అవకాశం కనిపిస్తుంది. ఈ తరుణం లో శౌర్య ని మళ్ళి ఎలాగైనా విజయ పథం లో చూడాలి అనే ఉదేశ్యం తో శౌర్య తల్లిదండ్రులు తమ సొంత నిర్మాణం లో ఈ సినిమా కి డబ్బులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు చలో సినిమా తో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత నర్తనశాల తో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ సారి అవసరాల కథ మీద నమ్మకం తో ఆయన అడుగుతున్న బడ్జెట్ లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఎంత వరకు సబబు అనేది తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories