Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శుక్రవారం, 29 మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, సప్తమి (రాత్రి 09:55 వరకు), తదుపరి అష్టమి.సూర్యోదయం 5:45 am, సూర్యాస్తమయం 6:42 pm

ఈరోజు తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 29 May 2020 2:18 AM GMT

    * వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

    * పెండ్యాల సమీపంలో ధర్మాసాగర్ బీదర్ నుంచి రెండు కార్లలో తరలిస్తున్న రూ. 15 లక్షల అంబర్ గుట్కా ప్యాకెట్ లు పట్టివేత.

    * గుట్కా ప్యాకెట్ లతో పాటు రెండు కార్లు స్వాధీనం.

    * నలుగురు అరెస్టు.



     


  • 29 May 2020 2:10 AM GMT

    తెలంగాణాలో కొండపోచమ్మ జలాశయం ప్రారంభం నేడే!

    తెలంగాణా లో గోదావరీ జలాల ఎత్తిపోతల పథకం కొండపోచమ్మ జలాశయం ఈరోజు ప్రారంభం కానుంది.

    ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ జలాశయాన్ని శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభిస్తారు.

    దీనికోసం కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, మర్కూక్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శన హోమం నిర్వహిస్తారు.

    ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిన జీయార్ స్వామి హాజరుకానున్నారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.



     



  • 29 May 2020 1:46 AM GMT

    నిమ్మగడ్డ రమేష్ కేసులో తీర్పు నేడు?

    - ఏపీ హైకోర్టులో  నిమ్మగడ్డ రమేష్ కేసులో ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది.

    - సోమవారం నుంచి కోర్టుకు వేసవిసెలవులు కావడంతో ఈ కేసులో తీర్పు ఈరోజు వెలువడ వచ్చని భావిస్తున్నారు.

    - అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారం పై కూడా హైకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

    - నిన్న ఏపీ సీస్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

    - అయితే, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది.

    - ఈ నేపధ్యంలో ఈ కేసు విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Print Article
More On
Next Story
More Stories