Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 26 మే, 2020 :
ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 May 2020 9:59 AM IST
- వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ప్రమాదం.
- గ్రామానికి చెందిన కంటెం ఈశ్వరమ్మ 60 సం, వృద్ధురాలు బావిలో పడి మృతి.
- కుటుంబ కలహాలే కారణమంటున్న గ్రామస్తులు
- 26 May 2020 9:56 AM IST
నాకు క్వారంటైన్ నిబంధనలు వర్తించవు : కేంద్ర మంత్రి
- కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడ ఢిల్లీ నుంచి బెంగళూరు ప్రత్యెక విమానంలో వచ్చారు.
- నేరుగా ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు.
- ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విమానాల్లో వచ్చిన వారిని బెంగళూరులో క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు.
- అయితే మంత్రి నేరుగా తన నివాసానికి వెళ్లిపోవడం పై విమర్శలు వచ్చాయి.
- తాను కేంద్రంలో ఔషధ శాఖా మంత్రి అనీ, తన శాఖ అత్యవసర సర్వీసుల పరిధిలో ఉందనీ, అందుకే తనకు క్వారంటైన్ నిబంధన వర్తించదనీ మంత్రి చెప్సపారు.
- ఆరోగ్య సేతు యాప్ లో నా వివరాలు పొందుపరిచాను.. తరచూ వైద్య పరీక్షలు చేయిన్చుకున్తున్నాను అంటూ మంత్రి సదానంద గౌడ చెప్పుకొచ్చారు.
- 26 May 2020 9:42 AM IST
- ప్రేమించిన యువకుడిపై కత్తితో దాడి
- నిద్రమాత్రలు మింగి యువతి ఆత్మహత్యాయత్నం
- కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సంఘటన.
- అపస్మారక స్థితిలో యువతి... మచిలీపట్నం ఆసుపత్రికి తరలింపు.
- ఆర్కే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న యువతి మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెం మాగంటి నాగలక్ష్మి
- గూడూరుకు చెందిన, పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న యువకుడు గొరిపర్తి పవన్ కుమార్
- ఇరువురి మధ్యా గత రెండేళ్లుగా పరిచయం.
- 26 May 2020 9:40 AM IST
వలస కార్మికులతో వెళుతున్న బస్సు బోల్తా..
శ్రీకాకుళం జిల్లాలో వలస కార్మికులతో వెళుతున్న బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు
➡️ప్రమాద సమయంలో బస్సులో 42 మంది
➡️బాధితులందరూ పశ్చిమ బెంగాల్ వారే
➡️కర్ణాటక నుంచి వస్తుండగా ఘటన
➡️గాయపడిన వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు
➡️కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- 26 May 2020 9:38 AM IST
- సఖినేటి పల్లి వద్ద ముందుకు వచ్చిన సముద్రం
- సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో రెండు కిలోమీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చిన వైనం.
- సముద్రపు నీట మునిగిన పంటపొలాలు
- స్థానికులలో ఆందోళన
- 26 May 2020 8:18 AM IST
అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తే..
- రాబోయే విద్యా సంవత్సరానికి కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటింటికి వెళ్లి విద్యార్థులను చేర్పించుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి.
- దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం వున్న నేపథ్యంలో అడ్మిషన్ల ప్రచారంలో ఎవరూ పాల్గొనకూడదు.
- నిబంధనలను అతిక్రమిస్తే స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్య లు తీసుకోవడమే కాకుండా ముందస్తు నోటీసు జారీ చేయ కుండా స్కూల్ గుర్తింపు రద్దు చేస్తారు.
- పశ్చిమగోదావరి జిల్లా డీఈవో రేణుక
- 26 May 2020 7:56 AM IST
ఉపరితల ద్రోణి - వడగాలుల జోరు
- ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా మధ్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.
- దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
- 27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడవచ్చు.
- దక్షిణ కోస్తాలో వడగాలులతో ఎండ తీవ్రత ఉంటుంది
- వాతావరణ శాఖ ప్రకటన
- 26 May 2020 7:53 AM IST
విశాఖలో కరోనా అలజడి
- విశాఖపట్నంలో కరోనా కల్లోలం
- నిన్న ఒక్కరోజే 10 కేసులు నమోదు
- ఐదు కేసులు వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి
- ఐదు కేసులు స్థానికంగా నమోదు
- అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్
- 26 May 2020 7:12 AM IST
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అరుదైన దేవాంగ పిల్లి పిల్లలు
- తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అరుదైన దేవాంగ పిల్లి పిల్లలు కనిపించాయి.
= రోడ్డు నిర్మాణ కార్మికులకు అవి కనిపించాయి.
- వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
- వాటిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు వాటిని అరుదైన దేవంగ పిల్లి పిల్లలుగా గుర్తించారు.
- శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన దేవాంగ పిల్లులు ఉంటాయని వారు చెప్పారు.





