Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Published on: 18 Jun 2020 6:08 AM IST

ఈరోజు గురువారం, 18 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ద్వాదశి ( ఉ.09:38 వరకు), భరణి నక్షత్రం (ఉ.08:30 వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 18 Jun 2020 8:58 AM IST

    చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని బురుగులపల్లి, కోడిగానీపల్లి, చిన్నగొల్లపల్లి, పెద్దగొల్లపల్లి గ్రామాల సమీపంలో ఈరోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో పంటపొలాలపై ఏనుగుల సంచారం, టమోటా, చామంతి పంటలతో పాటు డ్రిప్ పైపులు ధ్వంసం, భారీగా నష్టపోయిన రైతులు.

  • 18 Jun 2020 8:36 AM IST

    * విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.

    * మైదాన ప్రాంతంనకు అక్రమంగా తరలిస్తున్న రూ. 20 లక్షల విలువైన 970కిలోల గంజాయి పట్టివేత.

    * ఇద్దరు అరెస్టు, రెండు సెల్ ఫోన్లు, గంజాయి తరలిస్తున్న లారీ స్వాధీనం.

  • 18 Jun 2020 8:35 AM IST

    నేడే తెలంగాణా ఇంటర్ ఫలితాలు..

    - ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసింది.

    - ఫలితాలు నేరుగా ఇంటివద్ద ఉండి చూసుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ డౌన్ లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

    - ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

    - ఇక విద్యార్ధులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in, manabadi.co.in, schools9.com వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి విద్యార్ధులు చెక్ చేసుకోవచ్చు.

    - వీటితో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో TSBIE m-Services అనే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.

    - మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు.

    - తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు.




  • 18 Jun 2020 7:58 AM IST

    భారీ టేకు చేప!

    - కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు సముద్రంలో దొరకిన భారీ టేకు చేప

    - 1,150 కిలోల బరువున్న టేకు చేప

    - పడవ నుంచి క్రేన్‌ సాయంతో వెలికి తీత

    - రూ.37 వేలు పలికినట్లు చెప్పిన మత్స్యకారులు.

    - ఇలాంటి టేకు చేపలు అరుదుగా దొరుకుతాయని చెప్పిన మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రమణ. 



  • 18 Jun 2020 6:38 AM IST

    కాసేపట్లో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

    - ఈరోజు ఉదయం 8 గంటలకు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

    - సూర్యాపేటకు చేరిన సంతోష్ బాబు పార్థివ దేహం

    - కేసారంలో సైనిక లాంచనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు

    - దేశవ్యాప్తంగా సంతోష్ బాబు కు నివాళులు అర్పిస్తున్న ప్రజలు 



  • 18 Jun 2020 6:33 AM IST

    - రెండు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.

    - సమావేశాల్లో 15 బిల్లులకు ఆమోదం లభించింది.

    - రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు.

    - బడ్జెట్ పై పెద్దగా చర్చ జరగలేదు

K V D Varma

K V D Varma

Next Story