Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు మంగళవారం, 02జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఏకాదశి (మధ్యాహ్నం 12:04 వరకు), తదుపరి ద్వాదశి.సూర్యోదయం 5:40am, సూర్యాస్తమయం 6:47 pm.

Show Full Article

Live Updates

  • 2 Jun 2020 9:21 AM GMT

    దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

    -శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ.2.12 కోట్ల స్కాం

    -27 మంది అరెస్ట్

    -డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలు

    శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు.

    షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ కుంభకోణంలో మొత్తం రూ.2.12 కోట్లు స్వాహా జరిగినట్టు తేల్చారు. పోలీసులు ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.




  • 2 Jun 2020 8:53 AM GMT

    సిఎం జగన్‌తో మంత్రులు, విజయసాయి కీలక భేటీ

    -ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని భేటీ

    -తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొనసాగుతున్న భేటీ.

    -సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దవ్వగానే మంత్రులు ఆయన్ను కలవడం ప్రాధాన్యత .

    -అరగంట నుంచి జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారంపై కూడా కీలక చర్చ

    -ఈ భేటీ అనంతరం కొడాలి నాని లేదా విజయసాయి మీడియా మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం..

  • 2 Jun 2020 7:35 AM GMT

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. రెండో బ్లాక్‌లోని హోం, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు పరీక్షలు చేశారు. మూడ్రోజులపాటు ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

  • 2 Jun 2020 7:34 AM GMT

    నిమ్మగడ్డ వ్యవహారంలో కీలక పరిణామం...

    హైకోర్టు తీర్పుపై స్టే పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ప్రభుత్వం

  • 2 Jun 2020 7:13 AM GMT

    కృష్ణా జిల్లా: ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గరికపాడు వద్ద ఏపి39 ఏయం 1000 ఇన్నోవా కారులో భారీగా తరలిస్తున్న అక్రమ మధ్యo బాటిళ్లను 77 పట్టుకున్న పోలీసులు 

  • 2 Jun 2020 6:29 AM GMT

    ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 115 కేసులు...

    -ఆంధ్రప్రదేశ్‌లో 115 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ.

    -వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 33.

    -రాష్ట్రంలో 82 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

    -ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,791 కేసులు నమోదయ్యాయి.

    -మృతుల సంఖ్య 64 కి చేరింది.

    -ఇప్పటి వరకు 2,209 డిశ్చార్జ్ అయ్యారు.

    -927 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.  

  • 2 Jun 2020 6:24 AM GMT

    పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.

  • 2 Jun 2020 6:23 AM GMT

    రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తరువాత కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురువేశారు.

  • 2 Jun 2020 6:22 AM GMT

    రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు

    -సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

    -ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపాలకు గోదావరి జలాలతో నివాళులర్పించారు.

    -ఆ తరువాత జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు.

    -ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు.

    -దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు.

  • 2 Jun 2020 5:06 AM GMT

    గన్ పార్క్ వద్ద అలజడి..

    -కేసీఆర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన యువకుడు

    -సీఎం కారు డోర్ దగ్గరకు దూసుకెళ్లాడు.

    -డబుల్ బెడ్రూం ఇల్లు కోసం సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలిన యువకుడు.

    -వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.  




Print Article
Next Story
More Stories