Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 05 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, పౌర్ణిమ (ఉ.10:13రకు), పూర్వాషాడ నక్షత్రం (రా.11:02వరకు) సూర్యోదయం 5:46am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు గురుపూర్ణిమ. గురుపూజామహోత్సవానికి సంబంధించిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 July 2020 8:50 AM IST
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం
అమరావతి :
- ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం జమ కానున్నాయి.
- 2వ తేదీనే గవర్నర్ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ శనివారం వరకు ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.
- గవర్నర్ ఆమోదం పొందిన రోజే బడ్జెట్ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థికశాఖ జీవో ఇచ్చింది.
- పూర్తి వివరాలు
- 5 July 2020 8:47 AM IST
నేడు రేపూ వర్షాలు
అమరావతి :
- ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
- ఏపీ తీరప్రాంతానికి, దక్షిణ ఒడిసా తీరానికి పశ్చిమ దిశగా ఆవర్తనం నెలకొంది.
- ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.
- ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- 5 July 2020 8:44 AM IST
విజయవాడ: అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలెంటర్ అరెస్ట్.
- నున్న సచివాలయంలో వాలెంటర్ భూక్య జోసెఫ్ గా గుర్తించిన పోలీసులు.
- శనివారం అర్ధరాత్రి మద్యాన్ని ఆటోలో తరలిస్తూ పట్టుబడ్డ వైనం.
- అతని నుండి 180 బాటిల్స్ స్వాధీనం చేసుకున్న నున్న సిఐ ప్రభాకర్ సిబ్బంది.



