Live Updates:ఈరోజు (జూలై-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బుధవారం, 01 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, ఏకాదశి (సా.05:29 వరకు), విశాఖ నక్షత్రం (తె.02:34 వరకు) సూర్యోదయం 5:45am, సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 1 July 2020 1:47 AM GMT

    కుయ్ కుయ్ కు కొత్త వాహనాలు..

    - ఈరోజు  తొమ్మిది గంటలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 


  • 1 July 2020 1:38 AM GMT

    నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు: డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

    కడప: సీఎం ఆదేశాల మేరకు ఈరోజు నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా తెలిపారు.

    - కడప కార్పొరేషన్‌లో కోవిడ్‌-19పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది.

    - ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తోందని, అత్యధికంగా పులివెందుల, ప్రొద్దుటూరు పట్టణాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    - ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మాస్కులు లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, మున్సిపల్‌ కమిషనరు లవన్న, డీఎస్పీ సూర్యనారాయణ, తహసీల్దారు శివరామిరెడ్డి పాల్గొన్నారు.



  • 1 July 2020 1:36 AM GMT

    పేదలందరికీ ఇల్లు పథకం క్రింద ఎంపిక చేసిన లే అవుట్ లను పరిశీలించిన జేసి

    అనంతపురం: అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం క్రింద ఎంపిక చేసిన లే అవుట్ లను అనంతపురం జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తున్నారు.

    - మంగళవారం ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో, కుడేరు మండలంలోని కమ్మురు, గుంతకల్లు నియోకవర్గస్థాయిలో గుంతకల్లు మండలంలోని దొనముక్కల గ్రామాలలో తనిఖీ చేశారు.

    - ఎక్స్ టెన్షన్ చేసిన లే అవుట్ లో పనులు చేపట్టాలని, అర్హలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయు విషయములో పెండిగ్ లో ఉన్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

    - ఈ కార్యక్రమంలో ఉరవకొండ స్పెషల్ ఆఫీసర్ నిషాంత్ రెడ్డి, ఆర్డీవో భూషణ్ రెడ్డి, తహసిల్దార్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.



Print Article
Next Story
More Stories