Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 ఆగస్టు, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Published on: 4 Aug 2020 6:26 AM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Live Updates

  • 4 Aug 2020 7:21 AM IST

    శ్రీకాకుళం జిల్లా జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

    శ్రీకాకుళం జిల్లా..

    - ఇప్పటి వరకు 8,120 కరోనా కేసులు నమోదు..

    - 3422 ఆక్టీవ్ కేసులు..

    - 4544 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్..

    - 94 మంది మృతి..

  • గాయకుడు వంగపండు ఇకలేరు!
    4 Aug 2020 7:18 AM IST

    గాయకుడు వంగపండు ఇకలేరు!

    విజయనగరం జిల్లా..

    - అనారోగ్యంతో పార్వతీపురం లో ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ మృతి

    - 1943 లో విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో పెదబోండపల్లి లో జన్మించారు

    - ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు గాంచారు, జన నాట్యమండలి కి అద్యక్షుడు గా పనిచేసారు

    - 2017 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం అందుకున్నారు

    - 1972పీపూల్స్ వార్ యోక్క సాంస్కృతిక విభాగం అయిన జన నాట్యమండలి స్థాపించారు

    - 400కి పైగా జానపద గీతాలు రాసిన వంగపండు

    - 30పైగా సినిమాలకి పాటలు రాసిన వంగపండు

  • 4 Aug 2020 6:49 AM IST

    3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో పిటిషన్లు: ఈరోజు విచారణకు వచ్చే అవకాశం

    అమరావతి

    3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు

    హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు

    అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్

    సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్

    జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్

    కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు

    ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి

    ఈరోజు విచారణకు వచ్చే అవకాశం

K V D Varma

K V D Varma

Next Story