Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Sept 2020 9:28 AM IST
Srikakulam district updates: సీతంపేట బంద్ కు పిలుపునిచ్చిన గిరిజనులు..
శ్రీకాకుళం జిల్లా..
-జీవో నెంబర్ 3 ను వెంటనే పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఆందోళన..
-అనుమతి లేదని గిరిజనులను అడ్డుకున్న పోలీసులు..
-దోనుబాయి కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి గిరిజనులు ధర్నా..
-ఆదివాసీల ఆందోళనతో నిలిచిపోయిన వాహనాలు..
- 29 Sept 2020 9:24 AM IST
Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.....
అమరావతి..
-ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హచరిక జారీ
-మున్నేరు, వైరా, కట్టలేరు, నుంచి 30 వేల క్యూసెక్కుల వరద నీరు
-ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 6లక్షల 2 వేల క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 5లక్షల 95వేలు
-కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాల మేరకు 7 వేల క్యూసెక్కులు
-వరద నీటి ముంపు లోనే ఉన్న విజయవాడ లోని తారకరామ నగర్, భుపేష్ గుప్త నగర్, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్ ప్రాంత వాసులు
-పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న నిర్వాసితులు
-నీట మునిగిన పంట పొలాలు
- 29 Sept 2020 9:15 AM IST
Amaravati updates: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!
అమరావతి..
-పూర్తి అయిన కసరత్తు
-వచ్చేనెల మొదటి వారంలో ప్రకటించనున్న చంద్రబాబు
-ప్రధాన కార్యదర్శిగా బీదా రవిచంద్ర, పొలిట్ బ్యూరో లోకి కళా వెంకట్రావు, రాష్ట్రకార్య వర్గంలో కొల్లు రవీంద్రకు చోటు కల్పించనున్న అధిష్టానం
- 29 Sept 2020 9:12 AM IST
Visakha updates: నేడు రెండు తెలుగు రాష్ట్రా లలో మన్యం బంద్ కి పిలుపు నిచ్చిన గిరిజన జెఎసి సంఘాలు..
విశాఖ..
-గిరిజన ఉద్యోగ సంఘాలు బంద్ కు పిలుపు నివ్వడం తో నిర్మానుష్యంగా మారిన మన్యంలోని చింతపల్లి, పాడేరు, అరకు
-మూతపడిన వ్యాపార సంస్థలు, బంద్ కు మద్దతు పలికిన మావోయిస్టులు
- 29 Sept 2020 8:42 AM IST
Anantapur updates: ఐసిడిఎస్ లో అక్రమాలపై కలెక్టర్ సీరియస్..
అనంతపురం:
-ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు, కోడిగుడ్ల, సంపూర్ణ పోషకాహారం దుర్వినియోగం చేశారన్న అభియోగలపై సీరియస్.
-కళ్యాణదుర్గం పట్టణం, మడకశిర మండలం జమ్మనపల్లి, తలపులు మండలం లోని అంగన్వాడీ కార్యకర్తల తొలగింపునకు ఆదేశం
-17 మంది సిడిపిఓ లకు నోటీసులు జారీ
-జాయింట్ కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కు ఆదేశం
- 29 Sept 2020 8:40 AM IST
Somasila Project: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
నెల్లూరు..
--.ఇన్ ఫ్లో 86 వేల 8వందల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 94 వేల7 వందల క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 73.578 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు
- 29 Sept 2020 8:30 AM IST
Srisailam project updates: శ్రీశైలం జలాశయంలో క్రమంగా తగ్గుతున్న వరద..
కర్నూలు జిల్లా...
-10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 2,05,017 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 3,06,819 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 883.90 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 209.5948 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 29 Sept 2020 8:18 AM IST
Anantapur updates: అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలు కేసులో నలుగురిపై ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..
అనంతపురం:
-కర్ణాటక నుంచి కార్లను తీసుకొచ్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారన్న అభియోగలపై కేసు నమోదు
-ముదిగుబ్బ మండలం ఎస్ బ్రాహ్మణ పల్లి కి చెందిన శరత్ బాబు, అనంతపురం డిటిసి కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మాలిక్ భాష,అడ్మిన్ అధికారి మహబూబ్ బాషా, ఆర్టిఏ ఆన్లైన్ నిర్వహణాధికారి వినోద్ కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు
- 29 Sept 2020 8:11 AM IST
Anantapur updates: నేడు అనంతపురం లో నీటిపారుదల సలహా మండలి సమావేశం..
అనంతపురం:
-హాజరుకానున్న అనంతపురం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కడప, కర్నూల్ జిల్లాల ప్రజా ప్రతినిధులు.
-తుంగభద్ర నుంచి హెచ్ ఎల్ సి కి వస్తున్న 24.988 టీఎంసీలు,
-హంద్రీ-నీవా నుంచి సుమారు 40 టీఎంసీలు రావచ్చని అంచనా
-తుంగభద్ర డ్యామ్ హెచ్ ఎల్ సి నీటి వాటా కర్నూలు, కడప జిల్లాలకు కేటాయింపులపై చర్చ
-తాగునీటికి తొలి ప్రాధాన్యం హెచ్ ఎల్ సి నుంచి వచ్చే వాటిల్లో 10 టీఎంసీలు తాగునీటికి కేటాయించనున్న అధికారులు
-ఈ ఏడాది ఆలస్యంగా ఐ ఎ బి సమావేశం












