Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్స్ విషయంలో నలుగురిని అరెస్ట్ చేసిన తుళ్ళూరు పోలీసులు..
    29 Sep 2020 1:25 PM GMT

    Amaravati updates: ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్స్ విషయంలో నలుగురిని అరెస్ట్ చేసిన తుళ్ళూరు పోలీసులు..

    అమరావతి..

    -పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు

    -నలుగురు ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచిన

    -పోలీసులు...రిమాండ్ కి తరలింపు

    -పౌర సరఫరాల శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద 3 లక్షలకు పైగా వసూలు చేశారని ఏ గయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు  నమోదు

  • Chittoor updates: ఎస్ ఎస్ డిజిటల్ జోన్ లో సర్వర్ మొరాయింపు...
    29 Sep 2020 1:22 PM GMT

    Chittoor updates: ఎస్ ఎస్ డిజిటల్ జోన్ లో సర్వర్ మొరాయింపు...

    చిత్తూరు..

    -సుమారు అరగంటకు పైగా విద్యార్థులు పడిగాపులు

    -తెలంగాణ ఎంసెట్ ఆన్లైన్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులను నిలబెట్టిన సిబ్బంది...

    -పిల్లలను లోనికి అనుమతించకుండా నిలబెట్టడం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన...

    -సిబ్బందికి తల్లిదండ్రులకు కొద్దిసేపు వాగ్వాదం...

  • Amaravati updates: హైకోర్టును ఆశ్రయించిన ఆన్ -ఎయిడెడ్ స్కూ ల్స్ యాజమాన్యం..
    29 Sep 2020 1:19 PM GMT

    Amaravati updates: హైకోర్టును ఆశ్రయించిన ఆన్ -ఎయిడెడ్ స్కూ ల్స్ యాజమాన్యం..

    అమరావతి..

    -ప్రభుత్వం జారీ చేసిన 155 మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ..

    -155 మెమోను సస్పెండ్ చేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు..

    -ప్రవేట్ స్కూల్లోని విద్యార్థుల డేటాను యాజమాన్యానికి తెలియ కుండా తొలగిస్తున్నారన్న న్యాయవాది..

    -పూర్తి వివరాలతో కౌoటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం..

    -తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా..

  • Vizianagaram updates: నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..
    29 Sep 2020 1:14 PM GMT

    Vizianagaram updates: నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..

    విజయనగరం ...

    -శృంగవరపుకోట మండలం నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..

    -7గురు పేకాట రాయుళ్ళను, వారివద్ద నుండి 46 వేల రూపాయల నగదును, నాలుగు మోటార్ సైకిళ్ళను, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. 

  • Kurnool updates: కేసి కెనాల్ కరకట్ట ను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....
    29 Sep 2020 1:10 PM GMT

    Kurnool updates: కేసి కెనాల్ కరకట్ట ను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....

    కర్నూలు జిల్లా..

    -నంద్యాల మహానంది మండలంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి....

    -బొల్లవరం గ్రామం వద్ద కేసి కెనాల్ కరకట్ట ను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....

    -భారీ వర్షాలకు మహానంది మండలంలో పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....

  • Visakha updates: భూములను అక్రమించి,పేదలకు ఇద్దాం: సిపిఐ నారాయణ!
    29 Sep 2020 1:02 PM GMT

    Visakha updates: భూములను అక్రమించి,పేదలకు ఇద్దాం: సిపిఐ నారాయణ!

    విశాఖ..

    -కొమ్మాదిలో ఆక్రమణకు గురైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

    -రెండు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రా ఫ్యాక్షనిజం ప్రాంతంగా మారడం ఖాయం.

    -చట్టబద్ధంగా కాపురం చెయ్యాలి కాని ,చట్ట విరుద్ధంగా కాపురం చేస్తే ఎలా?

    -మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే ఈ భూమి వెనుక బినామి.

    -భూదొంగలను కాపాడడానికే ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.

    -భూ దొంగలకు ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది: సిపిఐ నారాయణ..

  • Tammineni Sitaram Comments: నెంబర్ 1 రేటింగ్ లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
    29 Sep 2020 12:57 PM GMT

    Tammineni Sitaram Comments: నెంబర్ 1 రేటింగ్ లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

    శ్రీకాకుళం జిల్లా..

    స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

    -దేశంలో ప్రధానమంత్రితో ప్రశంశలు అందుకుని నెంబర్ 1 రేటింగ్ లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

    -పాదయాత్ర సమయంలో సముద్రపు అలల మాదిరిగా ప్రజలు జగన్ వెంట నడిచారు..

    -ఆనాటి ప్రభుత్వం ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని కూడా పట్టించుకోలేదు..

    -ప్రజల కష్ట సుఖాలు చూడకుండా జన్మభూమి కమిటీలు ప్రజల నెత్తిన రుద్దారు..

    -దొరికింది దొరికినట్టుగా, పొడుగుచేతుల వాడిదే పలహారం అన్నట్లుగా జన్మభూమి కమిటీలు పేరుతో దోపిడీ చేశారు..

    -ప్రజలు అన్నీ గమనించారు..

    -151 స్థానాలతో వైసీపీకి పట్టం కట్టి.. తెలుగుదేశం అప్రజాస్వామిక, అధర్మ ప్రభుత్వాన్ని మట్టికరిపించారు..

  • Anantapur updates: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సాగునీటి సలహా మండలి సమావేశం..
    29 Sep 2020 12:53 PM GMT

    Anantapur updates: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సాగునీటి సలహా మండలి సమావేశం..

    అనంతపురం: 

    -తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నీటి కేటాయింపులు, హంద్రీనీవా నీటి వాటాల కేటాయింపులపై చర్చ.

    -అనంతపురం జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు.

    -తుంగభద్ర నుంచి ఈ ఏడాది 24.98టీఎంసీల కేటాయింపు.

    -హంద్రీ-నీవా నుంచి దాదాపు 30 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం.

    -అనంతపురం జిల్లా తో పాటు కడప జిల్లా పులివెందుల బ్రాంచ్ కెనాల్ కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్ కు నీటి విడుదల పై చర్చ.

    -అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీరు కేటాయింపు.

    -లక్ష ఎకరాల ఆయకట్టు కు సాగునీరు విడుదల

    -ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆయకట్టుకు నీరు విడుదల

    -తాగునీటి అవసరాల కోసం హంద్రీ-నీవా నుంచి 5 టిఎంసిలు, తుంగభద్ర హై లెవల్ కెనాల్ నుంచి 5 టిఎంసిలు మళ్లింపు.

    -సింగనమల చెరువు కు మిడ్ పెన్నార్ రిజర్వాయర్ ద్వారా హంద్రీ నీవా నీరు ఒక టీఎంసీ కేటాయింపు

    -చాగల్లు రిజర్వాయర్ నుంచి 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల

  • Anantapur updates: తాడిపత్రి పట్టణంలోని ఆంధ్రబ్యాంక్ లో గొడవ!
    29 Sep 2020 12:50 PM GMT

    Anantapur updates: తాడిపత్రి పట్టణంలోని ఆంధ్రబ్యాంక్ లో గొడవ!

    అనంతపురం: 

    -వెంకటాంపల్లి గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళా ఖాతాలో నగదు రూ.30 వేలను అదే గ్రామానికి పుల్లమ్మ అనే మరో మహిళకు ఇచ్చిన అధికారులు.

    -వారం రోజుల కిందట ఘటన. తమ ఖాతాలో నగదు పోయిందంటూ బ్యాంక్ అధికారులను సంప్రధించిన పుల్లమ్మ బంధువులు.

    -పొరపాటు జరిగిందని గ్రహించిన బ్యాంకు అధికారులు

    -డబ్బు తీసుకున్న వ్యక్తి నుంచి రూ.10 వేలు అదే రోజు రికవరీ.

    -వారం రోజుల తరువాత రూ.20 వేలు ఇస్తామని సర్ది చెప్పిన అధికారులు.

    -వారం గడిచిన తరువాత రూ.20 వేలు ఇవ్వాలని బ్యాంక్ వద్దకు వచ్చిన పుల్లమ్మ బంధువులు.

    -బ్యాంక్ ఫిల్డ్ అధికారి గంగాధర్ రెడ్డి తో నగదు ఇవ్వాలని వాగ్వాదం

    -ఒకరిపై ఒకరు బ్యాంకులోనే దాడికి దిగడం తో గందరగోళం.

    -ఆందోళన కారుల కు సర్ది చెప్పి పంపిన పోలీసులు.

  • Amaravati updates: కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్ధితిని సమీక్షించిన సీఎం..
    29 Sep 2020 12:46 PM GMT

    Amaravati updates: కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్ధితిని సమీక్షించిన సీఎం..

    అమరావతి..

    -భారీ వర్షాలు, వరదలు (పంట, ఆస్తినష్టం) అంచనాపై సీఎం జగన్ సమీక్ష

    -పంటనష్టం, ఆస్తి నష్టంపై అందరూ కూడా త్వరగా అంచనాలు పంపండి.

    -ఆర్‌బీకే లెవల్‌లో ఎన్యూమరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ డిస్‌ప్లే చేయాలి.

    -ఇప్పటివరకూ వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చింది వారికి వెంటనే రూ. 5 లక్షలు కలెక్టర్‌లు ఇవ్వాలి.

    -కుటుంబానికి తోడుగా ఉండాలి, వెంటనే ఆ కుటుంబాలకు డబ్బు అందించాలి.

Print Article
Next Story
More Stories