Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 28 Sep 2020 3:54 AM GMT

    Khammam district updates: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు..

    ఖమ్మం...

    -నేడు మావోల బంద్ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు

    -15 రోజుల్లో మూడు ఎన్ కౌంటర్లలో ఆరుగురు దళ సభ్యులు మృతి కి నిరసనగా నేడు మావోల బంద్ పిలుపు

    -ముందు జాగ్రత్త చర్యగా ఏజెన్సీ ప్రాంతాలకు బస్ సర్వీసులు నిలిపివేసిన అధికారులు

    -అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్

  • 28 Sep 2020 3:51 AM GMT

    Warangal district updates: నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..

    వరంగల్..

    -బూటకపు ఎంకౌంటర్ లను వెతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి జగన్.

    -బంద్ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు.

    -ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా ల పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

    -చత్తీస్ గర్డ్, మహారాష్ట్ర బార్డర్ లో భద్రతను పెంచిన పోలీసులు.

    -ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

    -నేటితో మావోయిస్టుల వారోత్సవాలు ముగియనుండటంతో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు

  • 28 Sep 2020 3:48 AM GMT

    Kamareddy district updates: నిజాం సాగర్ కు జలకళ...

    కామారెడ్డి :

    -మంజీర ఎగువ ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు భారీగా వస్తున్న వరద.

    -7 టి.ఎం.సి.లకు చేరిన నిజాం సాగర్ నీటి మట్టం.

    -పూర్తి స్థాయి నీటి మట్టం 17 టి.ఎం.సి.లు

    -ఇన్ ఫ్లో. 7878 క్యూసెక్కులు.

    -ప్రస్తుత నీటి మట్టం 7.337 టి.ఎం.సి లు

  • Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
    28 Sep 2020 3:45 AM GMT

    Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

    నిజామాబాద్ :

    -ఇన్ ఫ్లో 148003 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 179851 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

    -40 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు, వరద గేట్ల ద్వార 160938 క్యూసెక్కుల విడుదల.

    -కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

    -జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి చేరిన 234 టీఎంసీ ల వరద నీరు

    -వరద గేట్ల ద్వారా గోదావరి లోకి 127టీఎంసీలు వృధాగా వదిలేసిన అధికారులు

  • Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్  క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....
    28 Sep 2020 3:32 AM GMT

    Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....

    నల్గొండ :

    -20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....

    -ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 4,19,454 క్యూసెక్కులు.

    -పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

    -ప్రస్తుత నీటి నిల్వ : 310.252 టీఎంసీలు.

    -పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.

    -ప్రస్తుత నీటిమట్టం : 589.40 అడుగులు

  • 28 Sep 2020 3:05 AM GMT

    Telangana latest news:ఈ రోజు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్..

    తెలంగాణ... 

    -రెండు రోజుల పాటు నాలుగు సెషన్స్ లో జరగనున్న ఎంట్రన్స్

    -మొత్తం 84 సెంటర్ లలో పరీక్ష నిర్వహణ, తెలంగాణ లో 67, ఆంద్రప్రదేశ్ లో 17 ల సెంటర్ ల ఏర్పాటు

    -పరీక్ష కు హాజరు కానున్న 78,970 మంది విద్యార్థులు

  • 28 Sep 2020 2:50 AM GMT

    Adilabad district updates: తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు..

    ఆదిలాబాద్..

    -కదంబ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ.

    -ఈనెల పందోమ్మిదిన న కదబ అడవులలో ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలను కాల్చి చంపిన పోలిసులు.

    -బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన. మావోలు

Print Article
Next Story
More Stories