Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 28 Sept 2020 9:19 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • PULI CHINTHALA PROJECT: పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల రాస్తారోకో..
    28 Sept 2020 1:48 PM IST

    PULI CHINTHALA PROJECT: పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల రాస్తారోకో..

    సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జి వద్ద వజినేపల్లి, బుగ్గ మాధారం గ్రామస్తులు ఆందోళన,రాస్తారోకో.

    పులిచింతల ప్రాజెక్ట్ గేట్ల ద్వారా వస్తున్న నీరు గ్రామంలో చేరి వందల ఎకరాల్లో పత్తి,వరి పంట మునక.

    ప్రతి ఏటా నష్టపోతున్న రైతులు.

    వజినేపల్లి, బుగ్గ మాధారం గ్రామాలను ముంపు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్.

    ముంపుకు గురైన పంటకు నష్టపరిహారం కల్పించాలని ఆందోళన.

  • HARISH RAO: అక్టోబర్ నుంచి కొత్త రెవెన్యూ చట్టం  ప్రారంభం: హరీష్ రావు
    28 Sept 2020 1:40 PM IST

    HARISH RAO: అక్టోబర్ నుంచి కొత్త రెవెన్యూ చట్టం ప్రారంభం: హరీష్ రావు

    హరీష్ రావు కామెంట్స్:

    - తెలంగాణ వస్తే మీ బ్రతుకు చీకటైతదన్న ఆంధ్రోల్ల బ్రతుకే చీకటైంది. తెలంగాణ కు 24 గంటలు కరెంటు తో వెలుతురు ఉంటుంది.

    - గత ప్రభుత్వాల హయాంలో చనిపోయిన శవాలను కాలేసి స్నానం చేద్దామంటే కరెంటు ఉండకపోతుండే

    - బీడీ కార్మికుల కు రెండు వేల ఫెన్షన్ ఇచ్చేది భారత దేశంలో తెలంగాణ ఒక్కటే

    - చంద్రబాబు హయాంలో భోరు, బావుల కాడ మీటర్లు పెడుతాంటే.. ప్రజలే ఆయనకు మీటర్లు పెట్టిండ్రు

    - కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టుమని 2500 కోట్ల ఆఫర్ ఇస్తే.. ముఖ్యమంత్రి కెసిఆర్ తిప్పికొట్టిండు

    - దుంపలపల్లి గ్రామంలో పలు కులసంఘాల భవన నిర్మాణానికి తక్షణమే కోటి రూపాయల మంజూరు

    - అక్టోబర్ నెలలో కొత్త రెవెన్యూ చట్టం పని ప్రారంభం కానుంది.

    - ఇకనుండి రైతులకు భూ సమస్యలు లేకుండా చేస్తాం

  • CONGRESS LEADER: దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నేతల సమావేశం.
    28 Sept 2020 1:35 PM IST

    CONGRESS LEADER: దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నేతల సమావేశం.

    తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ బసచేసిన దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం.

    రాజభవన్ లో గవర్నర్ ను కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో తదుపరి కార్యక్రమం పై మాణికం ఠాకూర్ తో చర్చిస్తున్న నేతలు.

    దిల్ కుశ గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా వెళ్లి రాజభవన్ గేట్ వరకు అనుమతి నివ్వాలని పోలీసులతో చర్చిస్తున్న కాంగ్రెస్ నేతలు.

  • CONGRESS LEADER: దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నేతల సమావేశం.
    28 Sept 2020 1:35 PM IST

    CONGRESS LEADER: దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నేతల సమావేశం.

    తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ బసచేసిన దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం.

    రాజభవన్ లో గవర్నర్ ను కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో తదుపరి కార్యక్రమం పై మాణికం ఠాకూర్ తో చర్చిస్తున్న నేతలు.

    దిల్ కుశ గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా వెళ్లి రాజభవన్ గేట్ వరకు అనుమతి నివ్వాలని పోలీసులతో చర్చిస్తున్న కాంగ్రెస్ నేతలు.

  • 28 Sept 2020 1:30 PM IST

    Zee School వద్ద తల్లిదండ్రుల ఆందోళన

    హైదరాబాద్ లోని హయత్ నగర్ Zee School ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన  

    ఆన్ లైన్ తరగతులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యం

    ఫీజులు కట్టలేని 250 విద్యార్థులను ఆన్ లైన్ తరగతుల నుండి తొలగించిన Zee స్కూల్ యాజమాన్యం...

  • CHANDRABABU: యువతకు భగత్ సింగ్ ఆదర్శం: చంద్రబాబు
    28 Sept 2020 12:51 PM IST

    CHANDRABABU: యువతకు భగత్ సింగ్ ఆదర్శం: చంద్రబాబు

    అమరావతి: ట్విట్టర్ లో టిడిపి అధినేత చంద్రబాబు...

    భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ వీరుని స్మృతికి నివాళులు.

    నాటి జాతీయోద్యమానికి స్ఫూర్తి కలిగించిన భగత్ సింగ్ పోరాటం...

    నేటికీ ప్రజావిప్లవాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

    అణచివేతను, దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలో నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి

  • CHANDRABABU: యువతకు భగత్ సింగ్ ఆదర్శం: చంద్రబాబు
    28 Sept 2020 12:51 PM IST

    CHANDRABABU: యువతకు భగత్ సింగ్ ఆదర్శం: చంద్రబాబు

    అమరావతి: ట్విట్టర్ లో టిడిపి అధినేత చంద్రబాబు...

    భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ వీరుని స్మృతికి నివాళులు.

    నాటి జాతీయోద్యమానికి స్ఫూర్తి కలిగించిన భగత్ సింగ్ పోరాటం...

    నేటికీ ప్రజావిప్లవాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

    అణచివేతను, దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలో నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి

  • 28 Sept 2020 12:45 PM IST

    జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి నిర్వీర్యం

    రాజధాని గ్రామాలు ముంపుకు గురి కాలేదంటే మాజీ సీఎం చంద్రబాబు పుణ్యమే

    కొండవీటి వాగు ఆయకట్టులో సుమారు లక్ష ఎకరాలలోకి చేరిన వరదనీరు

    సీతానగరం ఎత్తిపోతల ద్వారా నీటిని నదిలోకి వదలటం సంతోషం

    జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి నిర్వీర్యం

    పధకాల పేర్లు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు

    రైతు సమస్యలపై ప్రభుత్వానికి పట్టడం లేదు

    రాబోయే కాలంలో రైతుల ఆందోళన తప్పదు

  • బైంసా గడ్డేన్న ప్రాజెక్టుకు జ‌ల‌క‌ళ‌
    28 Sept 2020 12:29 PM IST

    బైంసా గడ్డేన్న ప్రాజెక్టుకు జ‌ల‌క‌ళ‌

    -  నిర్మల్ జిల్లా బైంసా గడ్డేన్న ప్రాజేక్టులోకి బారీగా చెరుతున్నా వరదనీటితో

    -  ఇన్ ప్లో 7350క్యూసేక్కులు

    - రెండు గెట్లను ఎత్తి 7350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అదికారులు

  • Pulichinthala Project updates: పులిచింతల ప్రాజెక్ట్ వరద..
    28 Sept 2020 12:09 PM IST

    Pulichinthala Project updates: పులిచింతల ప్రాజెక్ట్ వరద..

    సూర్యాపేట జిల్లా:-

    -ప్రస్తుత నీటి మట్టం: 44.69.. tmc

    -ప్రాజక్టు సామర్ధ్యం: 45.77tmc

    -ఇన్ ఫ్లో:524561 క్యూసెక్కులు.

    -మొత్తం అవుట్ ఫ్లో553079 క్యూసెక్కులు..

    -17 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల...

K V D Varma

K V D Varma

Next Story