Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 28 Aug 2020 2:28 AM GMT

    Bangalore riots updates: బెంగళూరు విధ్వంశం పై న్యాయవిచారణ

    -కర్ణాటక: బెంగళూరు నగర శివారులో దేవర జీవన హళ్ళి, కాడు గొండనహళ్లి పరిధిలో జరిగిన విధ్వంసం పై న్యాయ విచారణ

    -జిల్లా అధికారి శివమూర్తి ఘటన జరిగిన రెండు ప్రాంతాల్లో పర్యటన

    -విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో కాలిపోయిన బైకులు, పోలీస్ స్టేషన్ల లో జరిగిన నష్టాలను అంచనా వేసిన అధికారులు.

    -మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు 11న రాత్రి 7 నుంచి వేకువజామున నాలుగు గంటల వరకూ జరిగిన అన్ని ఘటనలపైన విచారణ చేయనున్న జిల్లా అధికారి.

    -సెప్టెంబర్ 2 నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడి

    -మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న విచారణాధికారి

  • 28 Aug 2020 2:21 AM GMT

    Visakhapatnam updates: నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

    విశాఖ..

    -నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

    -మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం జగన్ సమక్షంలో చేరనున్న రమేష్ బాబు

    -2009 పెందుర్తి, 2014 యలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు..

    -టీడీపీ విశాఖ రూరల్ అధ్యక్షుడు గా పని చేసిన పంచకర్ల ఇటీవల పార్టీ కి దూరంగా వుంటూ..నేడు వైసీపీ లో చేరుతున్నారు.

  • 28 Aug 2020 2:17 AM GMT

    Visakhapatnam weather updates: ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం...

    విశాఖ..

    -వెదర్ అప్ డేట్

    -ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....

    -మూడురోజుల్లో మధ్యప్రదేశ్ మీదుగా పయనించి బలహీన పడుతుంది..

    -రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి..

    -ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర లో తేలికపాటి వర్షాలు

  • 28 Aug 2020 2:10 AM GMT

    Srisailam project updates: జలాశయానికి తగ్గుతున్న వరద ఉదృతి..

    కర్నూలు జిల్లా....

    -శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ఉదృతి

    -6 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

    -ఇన్ ఫ్లో : 1,27,342 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో : 2,35,071 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

    -ప్రస్తుత : 884.60 అడుగులు

    -నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

    -ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు

    -కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 28 Aug 2020 2:04 AM GMT

    Anantapur updates: నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం

    అనంతపురం..

    అనంతపురం: నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం

    కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షతన జరగనున్న సమావేశానికి మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు

    ఖరీఫ్ పంటల సాగు, పంట పరిస్థితులు, రబీలో సాగు తదితర అంశాలపై కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం

  • 28 Aug 2020 1:47 AM GMT

    Anantapur updates: పోలీస్ కస్టడీకి కానిస్టేబుల్ వెంకట రమేష్..

    అనంతపురం..

    -అనంతపురం: పోలీస్ కస్టడీకి కానిస్టేబుల్ వెంకట రమేష్.

    -కార్లను అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టిన విషయం లో వెంకట రమేష్ నిందితుడు.

    -నిందితుడిపై పుట్లూరు, అనంతపురం రెండో పట్టణ పోలీసు స్టేషన్ల లో కేసులు నమోదు

  • 28 Aug 2020 1:39 AM GMT

    Anantapur updates: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ.

    అనంతపురం.. 

    -అనంతపురం: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ.

    -అనంతపురం జిల్లా నుంచి కర్ణాటక లోని బెంగళూరు ఇతర పట్టణాలకు ఆర్టీసీ బస్సుల కొనసాగింపు.

    -లాక్ డౌన్ సమయం లో రెండు రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరణ

  • 28 Aug 2020 1:34 AM GMT

    Ananthapur updates: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.

    అనంతపురం...

    -అనంతపురం: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.

    -ఢిల్లీకి చెందిన ఎక్స్ప్రెస్ ఇండియా గ్రూప్ సంస్థ ఆన్లైన్లో అవార్డు అందజేత.

    -సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి హై అలర్ట్ అప్లికేషన్ యాప్ ను రూపొందించేందుకు ఎస్పీకి అవార్డు ప్రధానం.

  • Vijayawada health updates: విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు
    28 Aug 2020 1:17 AM GMT

    Vijayawada health updates: విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు

    విజయవాడ...

    -విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు

    -వైద్య ఆరోగ్య శాఖామంత్రి, ఆళ్ళ నాని

    -కరోనా మహమ్మారిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘మాస్కే కవచం’

    -నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం

    -కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ‘మాస్కే కవచం’ ముఖ్య ఉద్దేశం

    -ఉపయోగించిన మాస్కుల్ని మూడురోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారవేయాలి

    -ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదు

    -ఇళ్లల్లో వయసు మీరిన వారికి కోవిడ్ రాకుండా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

    -బయటికి వెళ్లినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి

    -నెల రోజుల విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలి

Print Article
Next Story
More Stories