Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati Updates: వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేసారు...
    27 Oct 2020 1:44 PM GMT

    Amaravati Updates: వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేసారు...

     అమరావతి

    -ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

    -రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేసారు.

    -ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యం...?

    -3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని   చంపేస్తుంటే ఎంత కోపం రావాలి...?

    -రైతుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలి.

    -లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తాం.

  • Krishna District Updates: మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ దాడులు...
    27 Oct 2020 1:41 PM GMT

    Krishna District Updates: మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ దాడులు...

    కృష్ణాజిల్లా

    మచిలీపట్నం

    -టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవకతవకలపై ఏసీబీ కి ఫిర్యాదు చేసిన బాధితుడు

    -మచిలీపట్నం శ్రీనివాస్ నగర్ కృష్ణవేణి ఐటిఐ కాలేజ్ నాన్ లే అవుట్లో 20 సంవత్సరాలుగా భవన నిర్మాణాలు

    -నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు

    -మున్సిపాలిటీకి నాలుగు కోట్లు నష్టం వచ్చినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్

    -ఆర్ టి ఐ వేస్తే సమాధానమే చెప్పని మున్సిపల్ అధికారులు

    -వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏసీబీ ని కోరిన బాధితుడు

    -నాన్ లే అవుట్ స్థలాలు అని 14 శాతం టాక్స్ వసూలు చేసిన బందరు మున్సిపాలిటీ

    -స్థలాలు కొనుగోలు చేసిన వారి నష్టాన్ని బందరు మునిసిపాలిటీ చెల్లించాలని బాధితుడి డిమాండ్

    -లేనియెడల కోర్టుకు వెళ్లి నష్టపరిహారం సాధిస్తామన్న బాధితుడు

  • Amaravati Updates: టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్...
    27 Oct 2020 1:38 PM GMT

    Amaravati Updates: టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్...

      అమరావతి

    -పాల్గొన్న 175నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు

    -చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పట్ల బాధ్యతగా టిడిపి వ్యవహరిస్తోంది.

    -కరోనాతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉన్నాం.

    -ఏపి ఫైట్స్ కరోనా వెబ్ సైట్ తో పేదలకు లబ్ది.

    -కరోనా బాధితులను, దాతలను ఒకేవేదికపైకి తెచ్చి ఆదుకునే చర్యలు చేపట్టాం.

    -అధికారంలో ఉండి వైసిపి బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది.

    -వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు రూ రూ 77,500 ఎగ్గొట్టారు.

    -‘‘రైతు భరోసా’’ పేరుతో 5ఏళ్లలో ఒక్కో రైతుకు వైసిపి ప్రభుత్వం ఇచ్చేది రూ37,500మాత్రమే..

    -అదే టిడిపి ప్రభుత్వం వచ్చివుంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5కిస్తీల కింద, ఒక్కో రైతుకు రూ లక్షా 15వేలు వచ్చేది..ఒక్కో రైతుకు రూ 77వేల పైగా   ఎగ్గొట్టి మీడియాలో గొప్పగా యాడ్స్ ఇవ్వడం వైసిపి నమ్మక ద్రోహం.

    -ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ 4వేలకోట్లు ఇస్తామని రైతులను నమ్మించారు.

    -అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారు.

    -ఇప్పుడు రూ 500 ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారు.

    -ఇళ్ల స్థలాల పంపిణీ ఎన్నిసార్లు వాయిదాలు వేస్తారు..?

    -వివాదాల్లేని ఇళ్ల స్థలాల పంపిణీకి ఎవరడ్డం పడ్డారు..?

    -కోర్టులకు వెళ్లింది వైసిపి బాధితులైతే టిడిపిపై దుష్ప్రచారం చేయడం వైసిపి చేతగానితనం.

    -ఇళ్ల స్థలాలకు మడ అడవులను నరికివేస్తారా..?

    -15అడుగులలోతు ముంపు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తారా..?

    -కట్టిన ఇళ్లను, డిపాజిట్లు చెల్లించిన పేదలకు ఇవ్వరా...?

    -ఏడాదిన్నరగా హవుసింగ్ పెండింగ్ బిల్లులు ఎందుకని నిలిపేశారు..?

    -వైసిపి చేతగానితనానికి టిడిపిపై ఆడిపోసుకోవడం ఏమిటి..?

    -చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ టిడిపిపై కేసులు పెట్టడం ఏమిటి..?

  • Krishna District Updates: కె.బి చంద్రశేఖర్‌ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు...
    27 Oct 2020 1:34 PM GMT

    Krishna District Updates: కె.బి చంద్రశేఖర్‌ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు...

    కృష్ణాజిల్లా...

    # కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె.బి చంద్రశేఖర్‌ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

    # డీగ్రీ రెండు, నాలుగవ సెమిస్టర్‌ ప్రయోగ పరీక్షలు ఈరోజు నుంచి నిర్వహణ

    # ఈనెల 31 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి

    # నవంబరు 2నుంచి 12వరకు డిగ్రీ రెండో సెమిస్టర్‌ థియరీ పరీక్షలు

    # యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో డిగ్రీ రెండో సంవత్సరం నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు ముగిశాయి

    # 13,660మంది విద్యార్థులు హాజరయ్యారు

    # నాల్గవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేయనున్న యూనివర్సిటీ

  • Vizianagaram Updates: పైడితల్లి అమ్మవారి సిరిమానును దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం....
    27 Oct 2020 1:19 PM GMT

    Vizianagaram Updates: పైడితల్లి అమ్మవారి సిరిమానును దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం....

       విజయనగరం :

    -- సిరిమానును నాలుగవసారి అధిరోహించిన ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు

    -- డిసిసిబి బ్యాంక్ నుండి సిరిమానోత్సవాన్ని తిలకించి, దర్శించుకోనున్న మంత్రి బొత్స సత్యనారాయణ

    -- సిరిమాను పండుగకు దూరంగా రాజవంశీయుల వారసులు అశోక్ గజపతి రాజు

  • Vizianagaram Updates: ఘనంగా ప్రారంబమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం...
    27 Oct 2020 12:52 PM GMT

    Vizianagaram Updates: ఘనంగా ప్రారంబమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం...

     విజయనగరం...

    -అమ్మవారి ప్రదాన పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా కదిలిన సిరిమాను.

    -పాలదార, ఐరావతం, అంజలిరధం, బెస్తరివల ముందు కదలగా వెనుకగా అమ్మవారి సిరిమానోత్సవం కదలింది.

    -కరోనా నిబందనలతో భక్తులు లేకుండా ఆలయ సిబ్బంది అతి కొద్దిమందితో జరుగుతున్న సిరిమానోత్సవం

    -ప్రజలేవ్వరూ సిరిమాను కార్యక్రమంలో పాల్గొనకుండా పట్టణంలోని 15చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు.

  • Nellore District Updates: ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి...
    27 Oct 2020 12:35 PM GMT

    Nellore District Updates: ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి...

    నెల్లూరు :--

    -- జిల్లా వైసీపి సమన్వయ సమావేశానికి హాజరయ్యేదుకు నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి..

    -- సజ్జలకు స్వాగతం పలికిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి      గోవర్ధన్ రెడ్డి.

    -- నెల్లూరు జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను సజ్జల రామకృష్ణా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన మంత్రులు ఎమ్మెల్యేలు

    -- సజ్జల రామకృష్ణా రెడ్డి తో భేటీ అయ్యేందుకు పెద్ద ఎత్తున R&B గెస్ట్ హౌస్ కి చేరుకున్న వైసిపి నేతలు, అభిమానులు...

  • Guntur District Updates: వ్యవసాయ శాఖ అదికారులు,వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన...
    27 Oct 2020 11:23 AM GMT

    Guntur District Updates: వ్యవసాయ శాఖ అదికారులు,వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన...

    గుంటూరు..

    -ఫిరంగిపురం లోని మంగళగిరి ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ అదికారులు,వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన...

    -నకిలీ విత్తనాలు వలన నష్టపోయానని వ్యవసాయ అదికారులకు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,

    -ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలంలో వేసినవి నకిలి విత్తనాలు కావు.

    -పూత,పంట రాకపోతే నకిలీ సీడ్స్ అని నిర్దారిస్తాం...

    -బీపీటీ సమానంగా ఉండాల్సింది..కొంత పంటలో ముందుగానే మెలకెత్తింది...

    -ఒకే చోట రెండు రకాల విత్తనాలు నాటారు,అవి రెండు కలిశాయా అనే కోణంలో కూడ పంటను పరిశీలిస్తున్నాం..

    -బాపట్ల వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం...

  • Seediri Appalaraju Comments: రెండో విడత రైతు భరోసా గొప్ప విషయం..
    27 Oct 2020 10:20 AM GMT

    Seediri Appalaraju Comments: రెండో విడత రైతు భరోసా గొప్ప విషయం..

    శ్రీకాకుళం జిల్లా..

    -మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..

    -ఇటీవల పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతు భరోసా అందించడం మంచి పరిణామం..

    -విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు వ్యవసాయానికి కావలసిన తోడ్పాటును ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది..

    -గతంలో ఎన్నడూ రైతులకు ఇంత పెద్దఎత్తున అవసరాలు తీర్చిన సందర్భాలు లేవు..

    -కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మాకు అండగా ఉందనే భరోసా ప్రజల్లో కనిపిస్తోంది..

    -గతంలో లేని విధంగా ఉద్యాన పంటలు పండించే రైతులకు రైతు భరోసా వర్తింపచేయడం గొప్ప విషయం..

    -జలకళ పై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది..

    -రాబోయే రెండు మూడు నెలల్లో జలకళ పనులు పెద్దఎత్తున జరిగితే రబీకి ఎంతగానో ఉపయోగపడుతుంది..

  • Krishna District Updates: నందిగామ రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని....
    27 Oct 2020 10:04 AM GMT

    Krishna District Updates: నందిగామ రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని....

      కృష్ణాజిల్లా

      మంత్రి కొడాలి నాని

    -- గతంలో కంటే ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు

    -- దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు పడ్డట్టు లోకేష్ పర్యటన ఉంది

    -- చంద్రబాబు జూమ్ కి పరిమితమయ్యాడు

    -- లోకేష్ కు ట్రాక్టర్ నడపటం రాదు, పార్టీని నడపటమూ రాదు

    -- తెలుగుదేశంలో పార్టీలో ఉన్నవారు త్వరగా ట్రాక్టరు దిగకపోతే, ట్రాక్టరు మునిగిపోయినట్లు మీరు మునిగిపోతారు

    -- ట్రాక్టరు డ్రైవరుగా కూడా అతను పనికిరాడు

    -- లోకేష్ ట్రాక్టరును ఎలా ముంచేశాడో అలాగే పార్టీనీ ముంచివేస్తాడు

    -- టీడీపీ శ్రేణులు ముందే మేల్కొనండి

Print Article
Next Story
More Stories