Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Aug 2020 9:04 AM IST
Prakasam District updates: త్రిపురాంతకం లో ఎంపీడీఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్త్తున్న k. గంగాధర్ (28). తన గది లో ఫ్యాన్ ఉరి వేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు.
-ప్రకాశం జిల్లా.......
-త్రిపురాంతకం లో ఎంపీడీఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్త్తున్న k. గంగాధర్ (28). తన గది లో ఫ్యాన్ ఉరి వేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు.
-పోలీస్ మృతదేహాన్ని పోస్ట్ మర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.
- 27 Aug 2020 8:57 AM IST
Prakasam District updates: రిటైర్డ్ ఏఎస్పీ నరహరి అరెస్ట్....
-ప్రకాశం:
-రిటైర్డ్ ఏఎస్పీ నరహరి అరెస్ట్....
-దళిత నాయకుడు దాసరి మాల్యాద్రి తనకు డబ్బులు ఇవ్వాలన్న కారణంగా పోలీస్ స్టేషన్ లో పంచాయితీ పెట్టి దుర్భాషలాడారన్న కారణంగా మాల్యాద్రి ఆత్మహత్య చేసుకోవడంతో నరహరి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు...అరెస్ట్ చేసిన పోలీసులు
- 27 Aug 2020 8:00 AM IST
Amaravati updates: మధ్యాహ్నం 3 గంటలకి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సీఎం సమీక్ష
-అమరావతి
-మధ్యాహ్నం 3 గంటలకి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సీఎం సమీక్ష
-హాజరుకానున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు
-సాయంత్రం 4 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై సమీక్ష
-అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణంపై వీడియో ప్రెజెంటేషన్ చేయనున్న అధికారులు.
- 27 Aug 2020 7:56 AM IST
Visakhapatnam updates: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం...
-విశాఖ....
-వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం...
-ఒడిశ్శా, చత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా పయనించే అవకాశం..
-రాయలసీమ నుండి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి..
-వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
- 27 Aug 2020 7:34 AM IST
Amaravati updates: అధికార వికేంద్రీకరణ, CRDA చట్టాల అమలు పై నేడు హైకోర్టు లో విచారణ..
-అమరావతి
-అధికార వికేంద్రీకరణ, CRDA చట్టాల అమలు పై నేడు హైకోర్టు లో విచారణ.
-చట్టాల అమలు పై ఇప్పటికే స్టేటస్ కో విదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
-మూడు రాజధానుల అంశంపై నిన్న సుప్రీం కోర్టులో జరిగిన విచారణ
-పాలనా వికేంద్రీకరణ అమలుపై హై కోర్టు ఇచ్చిన స్టేటస్ కో రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
-హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
-హై కోర్టు విచారణపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు
-ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు లో విచారణ
-ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ
- 27 Aug 2020 6:50 AM IST
Kurnool updates: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి
-కర్నూలు జిల్లా....
-శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి
-8 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
-ఇన్ ఫ్లో : 2,26,751 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 2,91,279 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
-ప్రస్తుత : 884.80 అడుగులు
-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
-ప్రస్తుతం : 214.3637 టీఎంసీలు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి



