Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 26 Aug 2020 8:00 AM GMT

    Guntur updates: కొల్లిపరలో సాంబశివరావు అనే వ్యవసాయ కూలిపై దాడి

    -గుంటూరు...

    -కొల్లిపరలో సాంబశివరావు అనే వ్యవసాయ కూలిపై దాడి చేసిన ఓ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు స్థానిక నేతలు...

    -దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి...

    -నా తప్పు లేకుండానే నా పై దాడి చేశారు....

    -స్థానిక పోలీసులు పట్టించుకోవటం లేదు....

    -వెంటనే చర్యలు తీసుకోవాలని రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు సాంబశివరావు... కుల సంఘ నేతలు.

  • 26 Aug 2020 7:33 AM GMT

    Vijayawada updates: ఏపీ‌ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

    -విజయవాడ

    -ఏపీ‌ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

    -ఏడీజీపీ, లా అండ్ అఅర్డర్, డాక్టర్ రవి శంకర్

    -గత మూడు వారాలుగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్

    -పోలీసుల దురుసు ప్రవర్తనపై వచ్చిన కంప్లైంట్లు, లంచాల గురించి వచ్చిన కంప్లైంట్లపై పోలీసులకు దిశా నిర్దేశం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు

    -చట్టపరంగా ఎలా పోలీసులు ఉండాలో అలాగే ఉండాలి

    -పోలీసులు చేసిన కొన్ని దురుసు పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

  • 26 Aug 2020 7:31 AM GMT

    Vijayawada updates: రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

    -విజయవాడ

    -రాజధాని అమరావతి రైతులకు పెండింగ్లో ఉన్న కౌలు వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ

    -సి.ఆర్.డి.ఏ కార్యాలయం వద్దకు వచ్చిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు.

    -అరెస్టు చేసిన మహిళలను సూర్యా రావు పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు.

    -భూములిచ్చిన రైతులకు చట్ట ప్రకారం కౌలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని, అడగడానికి వచ్చిన రైతుల పైదౌర్జన్యం చేసి అరెస్టు చేయడం ప్రభుత్వానికి తగదు అని మధు విమర్శించారు.

  • 26 Aug 2020 7:01 AM GMT

    Krishna district updates: భారీగా గంజాయి పట్టివేత.. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన నందిగామ సబ్ డివిజన్ పరిధి డియస్పీ జివి రమణమూర్తి.

    -కృష్ణాజిల్లా:

    -భారీగా గంజాయి పట్టివేత

    -నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన నందిగామ సబ్ డివిజన్ పరిధి డియస్పీ జివి రమణమూర్తి.

    -విశాఖపట్నం నుండి బీదర్ కు తరలిస్తున్నట్లు నిందితులు.

    -నందిగామ (మ)జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద స్కోడా కారులో గంజాయి పట్టివేత.

    -సుమారు 193 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు.

    -పట్టుబడిన గంజాయి విలువ సుమారు 3,86,000 రూపాయలు ఉన్నట్లు తెలిపిన పోలీసులు..

    -కారులో నలుగురు వ్యక్తులు ఉండగా వారిలో ఇద్దరు మహిళలు, పరారీ లో కారు డ్రైవర్...

    -ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు.

    -నిందితుల నుండి స్కోడా కారు, ఐదు సెల్ ఫోన్ లను, ముప్పై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు.

  • 26 Aug 2020 6:53 AM GMT

    Amaravati updates: రాష్ట్రం మొత్తం ఉన్న 70వేల మంది పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

    -అమరావతి

    -రాష్ట్రం మొత్తం ఉన్న 70వేల మంది పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

    -పోలీసు‌ శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ డీజీపీ

    -ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అందరు పోలీసు అధికారులకు దిశా నిర్దేశం

    -ఇటీవల జరిగిన శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తన నియమావళిపై దిశ నిర్దేశం

    -క్రింది స్ధాయి‌ అధికారుల‌ వరకూ దిశా నిర్దేశం

    -క్షేత్ర స్ధాయిలో పోలీసు స్టేషన్లకు వస్తున్న బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి అన్న దానిపై దిశ నిర్దేశం

    -బాధితులతో పోలీసుల వ్యవహారశైలి ఎలా ఉండాలి అన్న దానిపై దిశానిర్దేశం

  • 26 Aug 2020 6:44 AM GMT

    Amaravati updates: కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

    -అమరావతి

    -కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

    -అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణకు హామీ ఇచ్చారు.

    -ఇప్పుడు రైతులపై పోలీసులతో ఉక్కు పాదం మోపుతున్నారు.

    -ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది.

    -తక్షణమే అరెస్ట్ చేసిన అమరావతి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

  • 26 Aug 2020 1:38 AM GMT

    Ananthapur updates: సర్వజన ఆస్పత్రి లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్

    -అనంతపురం :

    -సర్వజన ఆస్పత్రి లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్

    -ఐడీ వార్డు వద్ద ఘటన.. కొన్ని రికార్డులు దగ్ధం.

    -హుటాహుటిన వార్డులోని కరోనా బాధితులను ఇతర వార్డులకు షిఫ్ట్ చేసిన అధికారులు.

    -విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, ఎస్పీ సత్యఏసుబాబు.

    -వైరింగ్ పాతది కావడంతో షార్ట్ సర్క్యూట్ .

    -అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆసుపత్రి ఎదురుగా ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది ఇక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది.

    -ఎమ్మెల్యే అనంత,ఎస్పీ సత్యఏసుబాబు.

    -ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే హామీ.

    -ఘటన పై విచారణకు ఆదేశం

  • 26 Aug 2020 1:27 AM GMT

    Kurnool updates: శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం

    -శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం

    -2 క్రేస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటివిడుదల చేస్తున్న అధికారులు

    -ఇన్ ఫ్లో : 1,48,508 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో : 1,23,586 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

    -ప్రస్తుత : 885.00 అడుగులు

    -నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

    -ప్రస్తుతం : 215.8070 టీఎంసీలు

    -కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Print Article
Next Story
More Stories